#


Back

ప్రస్థానత్రయ సారం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

భగవద్గీత

ఉపనిషత్తులూ బ్రహ్మ సూత్రాలు రెండూ చెప్పుకొన్నాము. ఒకటి శ్రవణ ప్రధానమైతే ఇంకొకటి మనన ప్రధానమని కూడా పేర్కొన్నాము. ఆ రెండింటి సారమేదో గ్రహించాము. పోతే ఆ శ్రవణమైన మననమైన జ్ఞానాన్ని దినచర్యలో స్వానుభవానికి దెచ్చుకొనే మార్గమేదో అది ఆలోచించాలి. అలా తెచ్చుకోటానికే నిదిధ్యాస అని పేరు. దాన్ని మనకు బోధించటానికే వచ్చింది భగవద్గీత లోకంలోకి. ఇది 18 అధ్యాయాల గ్రంధం. అందులో మొదటిది సమస్యను చెబుతుంది. అదే విషాద యోగం. చివరిది దానికి పరిష్కారం తెలుపుతుంది. అది మోక్ష సన్యాసం. పోతే మధ్యలో ఉన్న పదహారు రకరకాలుగా ఆ మార్గాన్ని చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తాయి. క్రమంగా తెలుసుకొందాము.