వేదాంత విద్యా ధురీణి బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు శంకర భాష్యం యొక్క లోతుపాతులను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించడంలో వారు సిద్ధహస్తులు. పదవీ విరమణ తర్వాత కాలము నుండి గురువు గారు హైదరాబాదులో నివసిస్తూ దశోపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యం, భగవద్గీత వంటి ప్రస్థానత్రయ గ్రంథాలను అనేక ప్రకరణ గ్రంధాలను వారు తమ శిష్యులకు బోధించారు. 2001 వ సంవత్సరమున గురువు గారు విజయవాడకు తమ నివాసమును మార్చుకున్నారు. విజయవాడలో మరలా ప్రస్థానత్రయ గ్రంథాలను, మానసోల్లాసము, వేదాంత పంచదశి, త్రిపురా రహస్యము, శ్రీ లలితా సహస్రనామాలు, శ్రీ విష్ణు సహస్రనామాలు , అనేక ప్రకరణ గ్రంధాలను అద్వైత పరంగా సమన్వయం చేస్తూ బోధించిన తీరు అద్వితీయం.