ఆ శ్రీ అక్కడే కూచోక మనదాకా గానం చేస్తూ వచ్చి - దాన్ని గానం చేస్తూ పోతే మనలను మరలా అక్కడికి తీసుకుపోయి చేరుస్తుంది కాబట్టి దానినే గాయత్రి అన్నారు.
అయితే ఇప్పుడీ శ్రీ ఆశ్రయించిన ఆ తత్త్వమేమిటి. అది ఎలా ఉంది. దీని ద్వారా దాన్ని వాటేసుకొంటే మనకు దానివల్ల కలిగే ఫలమేమిటని ప్రశ్న. ఆ తత్త్వమేదో గాదు శివతత్త్వం. శవం కాని దేదో అది శివం. అన్నిటికీ మూలభూతం కాబట్టి ఎప్పుడూ ఉండేదది. ఎప్పుడూ ఉంటుంది గనుకనే అది మృత్యుంజయం. మృత్యువును జయించినది. మృత్యువంటే ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోవటం. ఎప్పుడూ ఉన్నప్పుడిక లేకపోవటమనే ప్రశ్నేముంది. సత్యమనేది ఎప్పుడూ సిద్ధమే గాని సాధ్యం కాదు. సిద్ధమంటే మనం సాధించక పూర్వమే ఉన్నదని అర్ధం. అందుకనే సత్యమని పేర్కొన్నారు దాన్ని. సత్ అంటే ఉండటమని అర్ధం ఏది ఉన్నదో అది ఎప్పుడూ ఉంటుంది. కనుకనే దానికి మృత్యువు లేదు. మృత్యువంటే లేకపోవటమే గదా. ఎప్పుడూ ఉందని చెబుతూ దానికి మృత్యువని చెబితే అది పరస్పర విరుద్ధం. అంచేత అది శివం సత్యం. మృత్యుంజయ మైనదా పరతత్త్వం.
అలాటి తత్త్వాన్ని మన అనుభవానికి తెచ్చే సాధనమది శ్రీ అని చెప్పు. గాయత్రి అని చెప్పు. ఏ పేరైనా పెట్టు. అది దానితో అవినా భావంగా ఉన్న పరాశక్తే.
Page 9