ఇక్కడ అలా కాక అవయవాల నుంచి ఏకా జన్మించారనే వర్ణిస్తున్నాడు. ఏమిటీ తేడా ఎందుకు వచ్చింది. దీనికి సమాధానం కావాలి మనకు. కాగా ఇక్కడ తేడాగా కనిపించినా మరలా ఈ విరాట్టురుషుణ్ణి వేరొక చోట ఉపనిషత్తు చిలువలు పలువలు పెట్టి వర్ణించింది. అక్కడ ఇలాటి తేడా కనపడదు. అక్కడ జన్మించటం పేర్కొన దుపనిషత్తు. మీదు మిక్కిలి బ్రాహ్మణోస్య ముఖమా సీత్తని వర్ణించినట్టే రెంటికీ కార్యకారణ భావాన్ని గాక అభేదాన్ని వర్ణిస్తుంది. చూడండి.
తస్యహ వా ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య మూర్లైవ సుతేజాః చక్షు ర్విశ్వరూపః - ప్రాణః పృధ గ్వర్త్మా - సందేహో బహుళ వస్తిరేవ రయిః - పృధివ్యేవ పాదౌ - అని మంత్రం. దీని అర్థమేమంటే ఆ వైశ్వానరుడికి అంటే విరాట్టురుషుడికి ద్యులోకమే శిరస్సు. సూర్యుడే నేత్రం - వాయువే ప్రాణం - ఆకాశమే దేహం జలమే మూత్ర స్థానం - పోతే పృధివే పాదాలు. చూచారా పురుష సూక్త మంత్రంలోనూ ఇక్కడా ఇంద్రియాలూ అవయవాలూ అన్నీ చక్కగా సరిపోతున్నాయి. కాని అక్కడ పురుష సూక్తంలో కార్య కారణాలకు జన్య జనక భావం చెబితే ఇక్కడ రెండింటికీ ఏకత్వం వర్ణిస్తున్నాడు. ఇది బ్రాహ్మణోస్య ముఖ మాసీత్తనే వర్ణనకు సరిపడే వర్ణన.
Page 89