ఆత్మసంయమ యోగము
భగవద్గీత
లౌకికమైనది విషమంగా అన్యోన్య విరుద్ధంగా ఉంటుంది. అలౌకికమైన దలా విషమంగా ఉండదు. అది సమం. విరుద్ధంగా ఉండదది అవిరుద్ధం. దేనితో ఎవరితో పేచీ పడదు. కారణం వాడు పట్టుకొన్నదీ నిత్యమూ అనుభవిస్తున్నదీ పరమాత్మ తత్త్వం. అది సర్వత్రా సమంగా పరచుకొని ఉన్న తత్త్వం. సర్వ పదార్ధాలకూ స్వరూపమది. కనుక దేనికీ విరుద్ధం కాదు. అవిరుద్ధం. అలాంటివాడే జ్ఞాని గనుక లోకంతో వ్యవహరించేటప్పుడు వాడి దృష్టి కెలాటి వైషమ్యంగాని పక్షపాతం గాని ఉండరాదు. అలా ఉండకుంటేనే వాడు జ్ఞాని.
మరి ఎలా ఉంటుంది వాడి దృష్టి ఎలా వ్యవహరిస్తాడు లోకులతో నని ప్రశ్న వస్తే చెబుతున్నాడు మహర్షి. సర్వత్ర సమం పశ్యతి. సర్వత్ర సమమైన తత్త్వాన్నే దర్శిస్తుంటాడు. ఎలా దర్శిస్తాడు దాన్నైనా. ఆత్మౌపమ్యేన. తనతో పోల్చుకొని చూస్తాడు. ఏమిటా పోల్చుకొనే విషయం. సుఖం వాయ ది వా దుఃఖం - సుఖం గాని దుఃఖంగాని. ఒక్క సుఖదుఃఖాలనే గాదు. ఏ ద్వంద్వాలైనా ఎప్పుడెక్కడ ఏ ప్రాణి ఏది అనుభవిస్తున్నా అది తానే అనుభవిస్తున్నట్టు భావిస్తాడు. తనకే ఆ సుఖదుఃఖాను భవ మేర్పడితే ఎలా ఉంటుందో అలాగే గదా వాటికి కూడా నని సానుభూతి చూపుతాడు. వ్రాస్తున్నాడు చూడండి భగవత్పాదులు.
యధా మమ సుఖ మిష్టం తధా సర్వ ప్రాణినాం సుఖమను కూలం యచ్చ దుఃఖం మమ ప్రతికూలం అనిష్టం యధా తధా
Page 515