ఆత్మసంయమ యోగము
భగవద్గీత
సర్వప్రాణినాం దుఃఖమనిష్టం - ప్రతికూలం ఇత్యేవ మాత్మౌపమ్యేన సుఖదుః ఖే అనుకూల ప్రతికూలే తుల్యతయా సర్వభూతేషు సమం పశ్యతి. నకస్యచి త్ప్రతికూల మాచరతి - సుఖదుఃఖాదులైన ద్వంద్వాలు నాకెలా అనుకూల ప్రతికూలాలో ఇష్టానిష్టాలో అలాగే గదా ప్రపంచంలో సకల ప్రాణులకూ నని భావించి దేనినీ బాధించడు. అన్నింటినీ సానుభూతిగా చూస్తుంటాడు. తనతో పోల్చుకోటమంటే ఇదే. అలా పోల్చుకొన్నప్పుడే సానుభూతి కలుగుతుంది.
ఏ బుద్ధుడి జీవితమో గుర్తు వస్తున్నది మనకిక్కడ. అయితే అది ధర్మమూ నీతి అనే స్థాయి వరకే చూచి చెప్పవలసిన మాట. భగవద్గీత అంతవరకే గాదిక్కడ చెబుతున్న విషయం. అంతవరకే అయితే ధర్మపురుషార్ధం. అది కూడా దాటి మోక్ష పురుషార్ధంగదా ఇప్పుడు బోధిస్తున్నది. సయోగీ పరమో మతః అంటున్నది వినండి గీత. జీవన్ముక్తుడైన జ్ఞాని జీవితమిది. అదే పరమం. ధర్మం కంటే ఉత్కృష్టమైనది. అయితే ధర్మాన్ని అతిక్రమించి పోవచ్చునా అని ఆశంక కలగవచ్చు. అది మరలా పొరబాటు. ధర్మాన్ని వదిలేస్తాడని గాదు అర్ధం. జ్ఞాని సర్వత్రా ఆత్మనే చూస్తున్నప్పుడు ధర్మమెలా వదిలేస్తాడు. ధర్మ విరుద్ధంగా ఎలా ప్రవర్తిస్తాడు. జ్ఞానికి లోకం మీద ఎంతైనా సానుభూతీ దయాదాక్షిణ్యాలూ ఉంటాయి. ఉండి తీరుతాయి. అలా ఉండటమే గాక అది కూడా దాటి సర్వమూ ఆత్మాకారంగా దర్శించే జ్ఞానముంది వాడికి. కేవల ధార్మికుడికీ నైతికుడికీ
Page 516