ఆత్మసంయమ యోగము
భగవద్గీత
కనిపించే ప్రతి ముఖమనే ద్వైత దృష్టి. తెలిసినవాడి కంతా ముఖమే. అలాగే సచ్చిద్రూపమైన ఆత్మా తదా భాస అయిన అనాత్మ రెండూ కలిసి ఆత్మే జ్ఞానికి.
కనుక జ్ఞాని తన దేహంలో ఉన్నా -దేహానికి బాహ్యంగా ప్రపంచంలో ఉన్నా - అంతా తన ఆత్మే తన స్వరూపమే. ఆఖరుకు సుఖదుఃఖాదికమైన ఏ దశలో ఉన్నా అదంతా ఆత్మే. వస్తు భేదం లేదు. దశా భేదం లేదు. అసలు భేదమే లేదు. ఇతరులకు భేదంగా కనిపించేదంతా వాడి కభేదమే. కనుక ఎక్కడ ఎప్పుడే దశలో ఉన్నా ఎలా నడుచుకొన్నా పరవాలేదు. ఆత్మలోనే ఉంటాడు. ఆత్మలోనే వర్ణిస్తుంటాడు. ఇదీ జీవన్ముక్తుడి వ్యవహారం. వాడిలా అభేద దృష్టితో ఉంటే మిగతా లోకులంతా భేద దృష్టితో వ్యవహరిస్తాంటారు కాబట్టి వాడి స్వరూపం వీరి కంతు పట్టదు. పైకి వాడూ తమలాగే ఆయా పనులు చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది. పైకి ఇద్దరి జీవితమూ ఒకేలా ఉన్నట్టు భాసిస్తున్నా - లోపల వాడి అనుభవం వేరు. వీరి అనుభవం వేరు. అది పైకి కనిపించేది కాదు గదా.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః || 32 ||
వ్యవహార మన్నందు కొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి మనం. జ్ఞాని వ్యవహారం వేరు. జ్ఞానం లేని లోకుల వ్యవహారం వేరు. జ్ఞాని వ్యవహారం లోకోత్తరమైతే అజ్ఞానులైన లోకులది లౌకికమైనది.
Page 514