జ్ఞాన యోగము
భగవద్గీత
తెగిపోతుంది. కనుక వైశ్యుడుండాలి. ప్రాణం లేకుంటే అసలు జీవితమే లేదు. కనుక క్షత్రియు డుండాలి. కాని చిత్రమేమంటే శరీరమూ ఇంద్రియాలూ - ప్రాణమూ ఇవన్నీ ఎన్ని ఉన్నా - ఇటు ప్రపంచ జ్ఞానం గాని అటు పరమాత్మ జ్ఞానం గాని వీటిలో దేనికీ లేదు. అది ఒక్క మనసుకే ఉన్నదా సామర్థ్యం. అదే బ్రాహ్మణుడంటే. బ్రహ్మ జ్ఞానాని కధికారి వాడే. అదే జీవితాని కంతటికీ గమ్యం. అందుకోసమే ఉందీ మనస్సు. దానికి సహకరించటానికే ఉన్నాయి శరీర ప్రాణేంద్రియాలు మూడూ. ఈ మూడింటి తోడ్పాటుతో మనసు బ్రహ్మజ్ఞాన మార్జించి ఆదృష్టితో చూస్తే ఇటు శరీర సృష్టి లేదు అటు విశ్వ శరీర సృష్టి లేదు. అంతా బ్రహ్మమయం గానే అనుభవానికి వస్తుంది.
అందుకేనేమో నేను సృష్టించినా యధార్థంగా సృష్టించ లేదని చాటుతున్నాడు పరమాత్మ. వ్యావహారికంగా సృష్టి జరిగిందని చెప్పకపోతే దేహేంద్రియాది సామగ్రి నుపయోగించుకొని మనసు జ్ఞాన సాధనకు నడుము కట్టదు. కనుక తాత్కాలికంగా జరిగిందని చెప్పాడు. జ్ఞానాన్ని ఆర్జించిన తరువాత చూడబోతే అసలు సృష్టే మాఫీ అయి అంతా తన స్వరూపంగానే అనుభవానికి వస్తుంది కాబట్టి పారమార్ధికంగా సృష్టే అసలు జరగలేదు - నేను చేయలేదని చాటుటం. కనుక వ్యావహారికంగా పారమార్ధికంగా ఎలా చూచి చెప్పినా చెప్పుకోవచ్చు చాతుర్వర్ణ్యమనే మాట కర్ధం.
Page 309