జ్ఞాన యోగము
భగవద్గీత
చేయటమే దీని లక్షణం. పరిచర్య అంటే మిగతా మూడు వర్ణాల వారికీ సేవ చేయటమనిగాదు. ఇక్కడ పరి అంటే అంతటా చర్య అంటే తిరగటం. సర్వత్రా తిరుగుతున్నదీ శరీరమే గనుక శరీరం శూద్రుడు. అలాగే ప్రతివాడిలో వైశ్యుడున్నాడు. కొనుగోలు అమ్మకం ఇవేగదా వైశ్యుడు చేసే పని. వైశ్యుడు మన ఇంద్రియాలే. జ్ఞానేంద్రియాలు బాహ్యమైన శబ్ద స్పర్శాదుల జ్ఞానం కొని తెస్తుంటాయి లోపలికి. అలా అందించిన సరకు మరలా బయటపెట్టి అమ్ముతుంటాయి వాగాదులైన కర్మేంద్రియాలు. ఈ వ్యాపారం వల్ల కలిగే లాభనష్టాలు జీవుడను భవిస్తుంటాడు.
పోతే ఇక క్షత్రియు డెవరో తెలుసా మనలో. ప్రాణం. అది ఎప్పుడూ కనిపెట్టి చూస్తుంటుంది కాపాడుతుంటుందీ శరీర సామ్రాజ్యాన్ని. క్షతం నుంచి కాపాడటమే క్షత్రియ లక్షణం. క్షతమంటే దెబ్బ. అది తగలకుండా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నది మనలో ప్రాణవాయువే గదా. కనుక అదే క్షత్రియుడు. కాగా ఇక ఇవి అన్నీ అయిన తరువాత బ్రాహ్మణుడెవరో చెప్పమంటారా. అది మనలో ఉన్న మనస్సే. జ్ఞానానికి నిలయమది. మనసు లేకపోతే ఆలోచనలేదు. ఆలోచించే స్వభావం మనసుకే ఉంది. చక్కగా ఆలోచించి సలహా ఇచ్చి మిగతా అన్నింటినీ నడిపేది అదే.
ఈ నలుగురూ కలిసి ఏక కుటుంబంగా ఒకే ఒక శరీర మనే రాష్ట్రంలో బ్రతుకుతున్నారు. శరీరం లేకుంటే ఆధారం లేదు వీటికి. కనుక శూద్రుడుండి తీరాలి. ఇంద్రియాలు లేకుంటే ప్రపంచంతో సంబంధమే
Page 308