జ్ఞాన యోగము
భగవద్గీత
దీనికి జవాబు భగవానుడూ చెప్పడు. భగవత్పాదులూ చెప్పరు మౌనంగా ఉండిపోయారు. అలా మౌనం వహించి పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్నట్టుండి మళ్లీ నోరు విప్పుతా రిద్దరూ. ఏమని బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః ఈ శ్లోకం చివరి పాదంలో ఉంది జవాబు. కర్మలూ గుణాలనూ బట్టి వచ్చాయి. గుణాలెలా వచ్చాయి. స్వభావ ప్రభవైః వారి స్వభావాన్ని బట్టి వచ్చాయట. స్వభావ మేమిటి. జన్మాంతర కృత సంస్కారః ప్రాణినాం వర్తమాన జన్మని స్పకార్యాభిముఖ త్వేన అభివ్యక్తః అని అక్కడ దానికర్ధం చెబుతారు భాష్యకారులు. మానవుల జన్మాంతర Past impression brought forward to the present life స్వభావమనే మాట కర్ధం. పరమాత్మ మానవుణ్ణి సృష్టించాడంటే దాన్ని బట్టే సృష్టించాడు గాని నిరంకుశంగా తన పాటికి తను సృష్టించలేదు. కాబట్టి వారి వారి స్వభావ దోషమే గాని ఇది పరమాత్మ దోషం కాదు.
స్వభావ దోషమని పేర్కొన్నామే. అందులో ఇంకా ఒక లోతైన భావం మనకు స్ఫురిస్తున్నది. దానివల్ల ఏర్పడ్డాయన్న నాలుగు వర్ణాలూ ఎక్కడో బాహ్యంగా లేవసలు. ఆ మాటకు వస్తే అవి ఈ జీవాత్మగా చెలామణి అయ్యే మన లోపలనే ఉన్నాయి. విమర్శ చేసి చూస్తే మనలోనే ఉన్నాయి నాలుగు వర్ణాలూ. అవేమిటంటే శూద్రుడు మన శరీరం. పరిచర్య
Page 307