ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
పదార్థమని కూడా వ్యవహరిస్తారు. పదార్థ జ్ఞానం వల్లనే వాక్యార్థ జ్ఞాన మేర్పడుతుందని సిద్ధాంతం. అవే తత్త్వం పదార్థాలు. తత్ అంటే బ్రహ్మం. త్వం అంటే మనబోటి జీవుడు. ఇవి రెండూ తత్త్వమసి వాక్యంలో ఉన్న రెండు పదాలు. వీటికి చెప్పుకోవలసిన అర్థమే తత్త్వమర్థం.
ఈ అర్థం వాచ్యమూ కావచ్చు లక్ష్యమూ కావచ్చు. వాచ్యార్థమైతే వీడు జీవుడే. వాడీశ్వరుడే. ఇద్దరికీ ఐక్యమనేది చెల్లదు. ఎందుకంటే రెండింటినీ ఉపాధులు వేరు చేస్తున్నాయి. దేహం జీవుడి కుపాధి. ప్రపంచం ఈశ్వరుడి ఉపాధి. ఈ రెండు పాధు లున్నంత వరకూ ఇద్దరూ దూరంగా ఉండిపోవలసిందే. దగ్గర పడలేరు. ఏకం కాలేరు. అంచేత వాచ్యార్థం కాక లక్ష్యార్థం చెప్పుకోవలసి ఉంది. అది జహదజహద్రూపమైనది. రెండంశాలలో ఒకటి పరిత్యజించి మరొకటి పట్టుకొంటే అక్కడ వర్తిస్తుందీ సూత్రం. సోయం దేవదత్తః- ఇలాంటి వాక్యాలలో కనిపిస్తుందది. సోయం అంటే వాడే వీడు. వాడే వీడన్నప్పుడు కాలానుగుణంగా జరిగిన మార్పులు మనసుకు రానీయక ఆవ్యక్తిని మాత్రమే ఎలా గుర్తిస్తామో- అలాగే ఇక్కడా తత్త్వాన్ని గుర్తించ వలసి ఉంది. జీవుడి శరీరాది సంఘాతమేది ఉందో దాని నుపేక్షించాలి. అహం అనే చైతన్యాంశ ఏది ఉందో దానినే పరిగ్రహించాలి. అలాగే ఆకాశాది పృధివ్యంతంగా ఈశ్వరుడికి ఏ విశ్వరూపముందో దాన్ని త్రోసిపుచ్చి అక్కడా ఏ చైతన్య లక్షణముందో దానినే పట్టుకోవాలి.
ఈ విధంగా ఉభయత్రా చైతన్యమొక్కటే శేషిస్తున్నది గనుక- చైతన్యమేక రూపం గనుక- ఉభయులూ ఏకమైన తత్త్వమేనని పర్యవసిస్తున్నది. పోతే ఆ దూరం చేసిన వారి ఆ
Page 93