ముఖావలోకనము
ముందు వర్ణించినట్లు మనం శివస్వరూపులమైకూడా అది మరచి పోయాము. స్వప్నంలాంటి ఈ సంసార మార్గంలో వచ్చి * ప్రవేశించాము. ఇక్కడే నిరంతరం పరిభ్రమిస్తున్నాము. మరచిపోవటం వల్లనే ఇదంతా మనకు సంప్రాప్తమయింది . కనుక మెళకువ వస్తే స్వప్న మెలా తొలగిపోతుందో అలాగే శివసంబంధి అయిన జ్ఞానముదయిస్తే ఇక్కడా మన అజ్ఞానం తొలగి పోతుంది. ఈ విధంగా మన స్వరూపాన్ని మనం గుర్తించటమే సాధనం గాని మరేక్రియా ఇక్కడా కూడా అక్కర లేదు. విస్మృతి స్మృతి ఇవి రెండే మాటలు. మొదటిది సమస్యా రెండవది దానికి పరిష్కారం. వీటికే అజ్ఞానమని జ్ఞానమని పర్యాయ పదాలు. అజ్ఞాన దృష్టికే పరాశక్తి వైఖరీ రూపంగా మారినట్టు మనకు భాసిస్తున్నది. అదే మనం ప్రపంచమని సృష్టి అని పేర్కొంటున్నాము. ఈ మారటమనేది ఇక్కడ సాంఖ్యులు చెప్పే పరిణామం కాదు. అద్వైతుల వివర్తం. మూలభూతమైన చైతన్యాన్ని విడిచి ఏ దశ గాని స్వతంత్రంగా లేదు. పర మొదలుకొని వైఖరి వరకు అన్ని దశలలోనూ ఆ శివచైతన్యం అనుస్యూతంగా చోటుచేసుకొనే ఉంది. అంటే ఏమన్నమాట. ఒకే ఒక చైతన్యం పరా పశ్యంతి మధ్యమలే గాక ఇప్పుడీ వైఖరీ రూపంగా కూడా మనకదే కనిపిస్తూ ఉంది. రజ్జువే సర్ప ధారాదులుగా కనిపిస్తున్నట్టు. అందుకే క్రియా రూపమైన సాధనమేదీ ఇందులో అక్కర లేదని ఘోషించటం. క్రియగాకుంటే మరేమిటి సాధనం. చెప్పాము గదా జ్ఞానమే నని. వైఖరీ రూపంగా కనిపిస్తూ ఉండటం అజ్ఞానం వల్లనైతే దీన్ని మరలా పరా రూపంగా చూడటం జ్ఞానం వల్ల అని గ్రహించాలి మనం. తమస్సును పారదోలటానికి తేజస్సే సాధనమైనట్టు అజ్ఞానానికి జ్ఞానమే సాధనం. తమస్సు పోతే అసలైన
Page 6