స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కావాలి. స్వతంత్రగా ఉండటానికి లేదు. స్వతంత్ర కావటాని కది చేతన కాదు. జడ. చేతనుడు శివమని వారు చెప్పే పరమాత్మే. కనుక ఆ శివ చైతన్యాన్ని ఆశ్రయించి ఉండాలది. అదే అర్ధనారీశ్వర తత్త్వం. ఈ అర్ధనారీశ్వర తత్త్వాన్ని ఎంతగా భావన చేశాడో కాళిదాసు చెప్పలేను. దాని ఆంతర్యాన్ని విప్పి చెప్పాలంటే ఆయన రచన లన్నింటనీ ఆ మార్గంలో తడవి చూడాలి. అది దీని తరువాతి అధ్యాయంలో ఎలాగూ చేయ బోతాను. కాబట్టి ఇంతకూ ప్రత్యభిజ్ఞ వరకూ నిలిస్తే చాలు. రెండద్వైతాలు లేవు. అంతా ఒకే ఒక అద్వైతం. అదే శివం. అదే అద్వైతం. శివాద్వైత మంటూ క్రొత్తగా పేరు పెట్టటం దేనికి. అద్వైతం శివం కాక పోతేగదా మరొక శివాద్వైతాన్ని మనం తెచ్చి పెట్టవలసింది. అశివం కానిదేదో అదీ శివమంటే. అశివ మీ సంసారమే మనకు. ఇదే మనకున్న పెద్ద సమస్య. దీనికి పరిష్కారం చేయగలిగితే అదే శివం. ఆ పరిష్కారం మామూలుగా బ్రతికే మానవుడా చేతగాక ఊరకున్నాడు. చేత నవునని చెప్పి ఆస్తికుడొక ఈశ్వరుణ్ణి కల్పించుకొన్నాడు. నాస్తికు డీశ్వరుడే లేడు పొమ్మని త్రోసి పుచ్చాడు. వీరి ముగ్గురిదీ అవివేకమే. సమస్యకు ముగ్గురిదీ పరిష్కారం కాదు. పరిష్కరించే ప్రయత్నమే లేని సామాన్యుడిదీ కాదు. ప్రయత్నిస్తున్న ఆస్తికుడిది నాస్తికుడిదీ కాదు. ఆస్తికు డీశ్వరుణ్ణి ఒప్పుకొని ఈ సమస్య వాడి మీద పారేశాడు. సృష్టిలో జరిగే అన్యాయా లన్నిటికీ ఎవరు కారణమంటే ఈశ్వరుడే అనవలసి వస్తుంది. ఇది ఆస్తికుడు చేసే పొరబాటు. ఇక నాస్తికుని పొరబా టేమిటంటే వాడీ ప్రపంచాన్ని తప్ప ఈశ్వరుణ్ణి ఒప్పుకోవటం లేదు. అలాంటప్పుడీ అన్యాయాలకూ అక్రమాలకూ ఎవడు బాధ్యుడంటే వాడి కసలు బవాబు లేదు. ఎవడూ కాదు దానిపాటి కదే అలా జరిగుతుందని చెప్పాలిక. అది సహేతుకంగా చెప్పలేక వేసే కప్పదాటు.
కాబట్టి ముగ్గురూ ముగ్గురే. లౌకికుడు- నాస్తికుడు - ఆస్తికుడు ముగ్గురూ చెప్పలేరు సమాధాన మీ సమస్యకు. అలా చెప్పగలిగిన వాడూ చేయగలిగిన వాడూ ఒక్క అద్వైతి మాత్రమే. అది ఎలాగని అడగ వచ్చు.
Page 36