సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఆ సృష్టికర్త అని నీకూ నాకూ అని పించవచ్చు. అలా సృష్టిస్తే అది ఒక అతి. అన్నీ దోషాలే పెట్టి సృష్టిస్తే అది ఒక అతి. ఎందులోనూ సమన్వయం లేదు. సామరస్యం అంతకన్నా లేదు. సామరస్యమే సృష్టి లక్షణం. ఇది గమనించి చేసిన కావ్య సృష్టి దానికి సలక్షణం. పరాఙ్మఖీ విశ్వ సృజః ప్రవృత్తిః అని కాళిదాస న్న మాటలో ఉన్న ఆంతర్య మిప్పుడర్థ మవుతుంది మనకు. సకల గుణాలూ ఒక చోటనే కుప్పబోసి సృష్టించ లేదా పరమేష్ఠి, అలా సృష్టించట మాయన కిష్టం లేదని కొనటం పొరబాటు. అలా సృష్టించటం కాదు అందం. సృష్టించక పోవటమే నిజానికి. ఎందుకంటే అందమనేది వైరస్యంలో లేదు. సామరస్యంలోనే ఉంటుందది. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండటమే గదా ఔచిత్యమని చెప్పాము. ఔచిత్యానికి మారు పేరే సామరస్యం. అలాంటప్పు డిది హేయ మిది ఉపాదేయమనే ప్రసంగ మెందుకు వచ్చింది. కిమివ హి మధురాణాం మండనం నాకృతీనాం అని కవి లోకానికి చాటి చెప్పాడంటే ఏమిటాయన హృదయం. సరసిజ మంద మైనదే. కాని దానిని కప్పి ఉన్న శైవలమో. కాదంటావు నీవు. కాదన్నా అది అక్కడే ఉంది. అది లేకుంటే గాదు. ఉంటేనే అందమా సరోజానికి. అలాగే శకుంతలా లావణ్యానికి వల్కలం మొరటుగా లేదట. మీదు మిక్కిలి రమ్యంగానే ఉందట. ఏకోహి దోషో గుణ సన్ని పాతే నిమజ్జతి. ఒకానొక దోషమున్నా పరవా లేదు. గుణాల నడుమ అది కూడా గుణంగానే కనిపిస్తుందట. మరీ అంత అందంగా ఉన్నా కన్నులు కోరగిస్తాయి. అసలలా ఉంటేనే కృత్రిమం. సమ పాళ్లలో ఉంటేనే సబబు. గుణా గుణాలు రెండూ పాలు పంచుకొని దేని స్థానంలో అది ఉండటమే రామణీయకం. సర్వమేవ తమసా సమీకృతం ధి ఙ్మహత్వ మసతాం హతాంతరం. చీకటిని వర్ణిస్తూ అంటాడు కవి. మిట్ట పల్లాలనే తేడా లేకుండా అన్నీ ఏకంచేసి చూపుతున్న దట చీకటి. పనికి రాని వాళ్ళకు పెత్తనమిస్తే ఇంతే. మంచీ చెడ్డా తేడా చూడరంటాడు. ఇంతెందుకు. పరాఙ్మఖీ అని ముందు పేర్కొన్నాడా కవి. చివరలో ఏమన్నాడో చూడండి అతడే మరలా. ఉన్నతేషు శశినః ప్రభా స్థితా నిమ్న సంశ్రయ
Page 213