#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

పరం నిశా తమః - నూన మాత్మ సదృశీ ప్రకల్పితా వేధసైవ గుణ దోషయో ర్గతిః - పల్ల ప్రదేశాల్లో చీకట్లు పడిపోయాయి. ఉన్నత ప్రదేశాల్లో వెన్నెల కాంతులు ప్రసరించ సాగాయి. ఇది న్యాయమే. వాటి వాటి స్వభావానికి తగినట్టే కల్పిస్తాడా విధాత గుణ దోష విభేధాన్ని అని సమర్దిస్తాడు. ఇవి రెండూ ఒక్క సారిగా చదివితే మన కనుమానం కలగవచ్చు. కాళిదాసు సృష్టిలో వైషమ్య మేమిటని తప్పు పడుతున్నాడా లేక సమర్థిస్తున్నాడా అని. ఆక్షేపించటమూ కాదిది క్రొత్తగా సమర్థించటమూ కాదు. గుణమనీ దోషమనీ కాదు చూడవలసింది. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉంటేనే గుణం. లేకుంటేనే దోషం. అందుకే నీవన్ని గుణాలూ ఒక్క చోట ఉండాలని ఆశ పడ్డా లాభం లేదు. విశ్వ కర్త అలా కేవల గుణాన్నీ కేవల దోషాన్నీ సృష్టించటాని కిష్టపడ డని పూర్వాపరాలు కలియ బోసుకొని చూస్తే మనకు స్ఫురించే నిగూఢమైన కవి హృదయం.

  కాబట్టి ఏక పక్ష పర్యవసాయి కాదు కాళిదాసు దృష్టి, అది జీవితంలో అన్ని కొసలనూ కలిపి పట్టుకొన్న సమగ్రమైన సమన్వయ దృష్టి, అది ఆదర్శ మానవ జీవితాన్ని కేంద్రంగా పెట్టుకొని అక్కడి నుంచి పరిధికి పరిధి నుంచి మరలా కేంద్రానికీ పయనం సాగించే వాడికే అలవడుతుంది. ఎంత దూరం పయనించినా ఎంత పెద్ద వలయం గీచినా కేంద్ర బిందువును విస్మరించ లేదు. మరలా అక్కడికి రావలసిందే. అన్ని వైపులా ప్రసరిస్తూ పోయిన భావ రేఖలన్నీ మరలా ఆ బిందువులో చేరి పోవలసిందే. అప్పుడే సమన్వయ మనే మాట చరితార్థమవుతుంది. ఏమి కారణం. మానవ జీవితమే సంపార చక్రానికి కేంద్ర స్థానం. కారణం. దృష్టాచ్చ అదృష్ట సిద్ధిః అన్నారు శాస్త్రజ్ఞులు. దృష్టాన్ని బట్టే అదృష్టం వైపు సాగి పోవాలి మన దృష్టి, మన లోకం మనకు దృష్టం. మన జీవితం మనకు దృష్టం. మన సుఖ దుఃఖ్యాద్యనుభవాలు మనకు దృష్టం. మనమిక ఏది ఆలోచించినా ఎంత దూర మాలోచించినా అందుకోవాలని ప్రయత్నించినా - మన దగ్గరి నుంచే సాగాలా

Page 214

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు