సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
గాక ప్రజా బాహుళ్యంలో కూడా విశృంఖలంగా తిరిగి పట్టుకొని ఉంటాడు భాషా హృదయాన్ని మహా కవి. ఒక భాష తన మాతృ భాషగా గలవాడు గొప్ప విద్వాంసుడై అందులోనూ మహా కవి అయి రచిస్తుంటే ఎలా ఉంటుందో ఉండాలని మన మూహిస్తామో అలాగే అంత సహజంగా సుందరంగా సరళంగా అనన్య సాధ్యంగా ఉంటుం దాయన వాక్య శిల్పం. అలాంటప్పు డిక ఆ భాషలోని సామెతలూ నుడికారాలూ అంద చందాలూ సహజంగానే చోటు చేసుకొని తీరుతాయి. వాక్య రచనలో తరువాత దండి సుబంధు బాణాదు లెంతగానో అంద చందాలు చూపటానికి యత్నించారు చూపారు గాని అవి కాళిదాసు చూపినంత సహజంగా చూపట్టవు. ఎంత సహజమో అంత కృత్రిమం కూడా వారి రచన. అంతా సహజం కాళిదాసుది. అంతే గాక కాళిదాసులో ఒక ఇంద్రజాలమున్నది. అది వారిలో లేదు. అదేమంటే కవితా శిల్ప కాంతులు కూడా చిమ్ముతుంటాయి వాక్యాలు. అవి పానకంలో గుడ మాధుర్యంలాగా ఎంతో హాయినిస్తాయి. బాణాదులు కూడా దాన్ని కొంత సాధించక పోలేదు. కాని వారి కది కాళిదాసు పెట్టిన భిషే. స్వల్పంగా వ్రాసినా కాళిదాసు వచనం వారిచేత అనల్పమైన వచన రచన చేయించిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం మహా కవి వాక్య నిర్మాణ రాసిక్య మెలాంటిదో కొంత తడవి చూద్దాము. మాళవికలో విదూషకుడికీ రాజుకూ జరిగిన సంభాషణ. భో వయస్య న కేవలం రూపే శిలేపి అద్వితీయా మాళవికా. వయస్య కిం బహునా చింతయితవ్యోస్మి. నాగురించి ఆలోచించు మరి. విదూ భవతాప్యహం నా గురించి నీవుకూడా. దృఢం విపణి కందురివ మే హృదయాభ్యంతరం దహ్యతే వీధి హోటల్లో పెనంలాగా నా కడుపు ఆకలి తో మండిపోతున్నది. రాజా ఏవమేవ భవా సుహృదర్దే త్వరతాం. ఇలాగే నీ మిత్రుడి విషయంలో త్వర పడాలి సుమా. విదూ- గృహీత క్షణోస్మి. గ్రహించా నీ కుతూహలం. కింతు మేఘావళీ నిరుద్దా జోత్స్నేవ పరాధీన దర్శనా తత్ర భవతీ మాళవికా. కాని మబ్బు చాటున వెన్నైలలాగా పరాధీన అయి ఉన్నదా
Page 181