సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
సులభ విపదః - సన్యస్తా భరణా తరళా ఆత్మాపహార - నేత్ర నిర్వాణ వారిగర్భ - శిశిర మధితా - ప్రభా గర్భ మంధరా హస్త ప్రాప్య -అపరిచ్ఛేదాకుల - స్వభావోల్తాన హృదయ- తేజో లిప్త - ఆతపచ్ఛేద - హత హృదయ - స్మృతి శైధిల్య సాంద్ర కుతూహల- రణశి రసి కృతాభిమర్శ ఆర్యం మనః - విగళిత శుచః - ధూతోధ్యాన స్తిమిత నయన - ఆమోద మైత్రి - ఆశిష్ట సాను అలస గమనా శిధిల సౌహార్ద - స్పర్శ లోభా -శుద్ధ శీలా - స్వాధీనోపాయ - ఇలాంటివి కుప్పతెప్పలూ కోకొల్లలు. చదువుతుంటే ప్రాత పడ్డవని గాక ఏవో క్రొత్త మాటలు వింటున్నా మన్న అనుభూతి నిస్తాయివి.
ఇలాటి పద బంధాలే గాక ఎన్నో లోకోక్తులు సామెతలు కూడా ప్రయోగిస్తాడు యథావకాశంగా. క్రియా పదాలు కూడా మామూలుగా గాక క్రొత్త పంథాలో వాడి చూపుతాడు. మందాయతే చిరాయతే వత్సలయతి పిశునయతి దీర్ఘకరోతి పాత్రీ కరోతి శబ్దాపయతి గృహీభవతి - పరిహీయతే గమనవేళా - వ్యాధినా లంఘితః- ఖిలీ భూతః మందీ కృతః మోఘీచకార-ఇలాటివెన్నో చమత్కారాలు. సామెత లన్నందుకు గుర్తు వస్తున్నది. పద శిల్ప మైన తరువాత మనం కాళిదాస కవి వాక్య శిల్పం కూడా దర్శించ వలసి ఉంది. వాక్య రచనా పాటవమూ సౌష్టవమూ కావ్యాలలో చెప్పుకోవటం కష్టం. కారణ మేమంటే అవి పద్య కావ్యాలు. పద్యాలలో కూడా వాక్య రచన చూడ వచ్చు గాని అంత బాగా బయట పడదది. ఆయన గారి వాక్య రచనా విభూతి చూడాలంటే నాటకాలలోనే చూడాలది. నాటకంలో పద్యా లక్కడక్కడా వచ్చినా ప్రధానంగా గద్యంలోనే సాగుతుంది రచన అంతా. అదీ కొంత సంవాదాత్మకంగా కొంత వర్ణనాత్మకంగా కొంత స్వగత రూపంగా. అక్కడ చూపాడు కాళిదాసు విజృంభించి తన భాషాధికారాన్ని సౌందర్యాన్ని. అసలు వాల్మీకి తరువాత సంస్కృతమంటే ఏమిటో తెలిసిన వాడు కాళిదాసే. ఆయన కాలానికి సంస్కృతం బాగా ప్రచారంలో ఉంది. విద్వ ర్గోష్ఠులు రాజాస్థానాల్లోనే
Page 180