సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మవుతుంది. స్థితాః క్షణం పక్ష్మసు తాడితా ధరాః పయోధరో త్సేధ నిపాత చూర్ణితాః - వలీషు తస్యాః స్ఖలితాః ప్రపేదిరే చిరేణ నాభిం ప్రథమోద బిందవః వర్షర్తువులో చేస్తున్న తపస్సిది. తొలుకారు చినుకులు ఆవిడ ఒంటి మీద పడుతున్నాయి. మొదట అవి కను రెప్పలమీద తరువాత పెదవుల పైన --పిమ్మట వక్షోజాల మీద అక్కడి నుంచి క్రిందికి జారి నాభిలో ప్రవేశించాయట. చూడండి. ఈ పద్యం మీరు చదువుతుంటే ధరాః-పయోధరో- త్సేధ నిపాత- అని అక్కడక్కడా ధకారాల ఉఛ్ఛారణలో క్రమక్రమంగా ఆ జల కణాలు పడుతున్న దృశ్యం కనపడుతుంది. వినపడుతుంది. ఆ తరువాత ప్రపేదిరే చిరే అన్నప్పుడు హ్రస్వ పూర్వక మైన రే అని రెండు ఏకారాలు చాలా సేపటికి నాభిలో ప్రవేశించాయనే విలంబ భావాన్నీ మన కందిస్తాయి. పోతే ఇందులో పద సార్ధక్య మెలాగూ ఉండనే ఉంది. క్షణం - తాడిత నిపాత చిరేణ. రెప్పలు తేలిక కాబట్టి ఎక్కువ కాలం నిలవవవి. అందుకే క్షణ. పెదవి సుకుమారం కాబట్టి తాడిత. ఉత్సేధం నుంచి పడటం కాబట్టి చూర్ణిత - ఆ పాటికవి చాలా వరకు క్షీణించాయి కాబట్టి వాభిని చేరటానికి చిర. ఎంత గొప్పగా ఉందో ఆ జగన్మాత తపో వర్ణన.
పరమేశ్వరుడు పెండ్లికి తరలి వస్తున్నాడు. ఎలాగనుకొన్నారు. నంది కైదండ ఇస్తుంటే ఆయనగారి మీది గౌరవంతో తన బృహచ్చరీరాన్ని కుంచించుకొని కూచున్న వృషభ వాహనం మీద కూచుని. ఆ కుంచించుకోట మెలా ఉంది. తద్భక్తి సంక్షిప్త బృహత్ప్రమాణం అంటాడు. ఇక్కడ తద్భ -క్షిప్త - బృహత్ - దగ్గర దగ్గరగా అక్షరాలు. అందులో హ్రస్వాలు. అవీ సంయుక్తాలు. దీని ద్వారా చూపుతున్నాడా కుంచించటాన్ని మహా కవి. అక్షరాల కుదింపు అవయవాల కుదింపును బయట పెడుతున్నది. పిమ్మట దాని మీద కూచోటమే తరవాయి. అది గగన మార్గాని కెగిరి మహా వేగంతో పయనిస్తున్నది. ఎలాగని. ఖే ఖేల గామీ త మువాహ మువాహః ఖే ఖే అనే
Page 169