సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కందించేది భాష, అది వర్ణమే కాదు. పదమే కాదు. వాక్య నిర్మాణమే కాదు. కడకు ఛందో బంధమే కాదు. అన్నింటిలో సిద్ధ హస్తుడు కాళిదాసు. అర్థ శిల్పంలో ఎంతవాడో శబ్ద శిల్పంలో అంతకన్నా అతీతుడు. ఆ మాటకు స్తే అర్థమే కవికి వివక్షితమైనా దాన్ని సహృదయుడి అనుభవానికి తేవాలంటే శబ్దమే అతని కాధారం. చిత్రకారుడికి రంగులూ కుంచే కాగితం లాగా-గాయకుడికి జంత్ర గాత్రాల లాగా కవికి శబ్ద సామగ్రి అనివార్యం. కావ్య రసం కవి హృదయమనే జలాశయం నుంచి రసజ్ఞుడి హృదయ మనే పాదు వరకూ ప్రవహించా లంటే శబ్దమే ప్రణాళిక. ఒక పెద్ద గొట్టం. అది ఎంత బలఁగా శుభ్రంగా ఉంటే రస స్పూర్తి అంతగా కలుగుతుంది. ఇది గమనించిన వాడే - ఈ కవి సహృదయుల కుండే సంధాన కరణిని గుర్తెరిగిన వాడే మహాకవి శబ్ద వాచ్యుడు. గుర్తించటమే గాక దాన్ని నూటికి నూరు పాళ్ళూ నిర్వహించిన వాడు కాళిదాసు.
పైన పేర్కొన్నట్టు వర్ణం దగ్గరి నుంచీ ఛందస్సు వరకూ సాగిం దాయన శబ్ద శిల్పం. విశ్వ రూపాన్ని ధరించి కనిపిస్తుం దాయన రచనల్లో. భావాను గుణంగా ఆయన అక్షరాలను పోహళిస్తాడు. అది అమోఘం. సుదక్షిణా దిలీపుల అనురాగం కుట్టి వాడి జన్మతో విభక్తమయి కూడా అంతకంతకు పెరిగి పోతూనే ఉందట. ఎలాగంటారు. పరస్పరస్యోపరి పర్యచీయత. ఇక్కడ పరి పరి అనే అక్షరాల కూర్పులో ఒక దాన్ని ఒకటి అంటి పట్టుకొన్నట్టు ఆరోహణ మార్గంలో పెరిగి పోతున్నట్టు మనకను భవానికి వస్తున్నది. పార్వతి తన ఆశ్రమంలో ప్రవేశించిన కపట బ్రహ్మచారి కర్జ్యం తీసుకొని ఎదురుగా వస్తున్నది. ఎలాగో తెలుసా. తమాతి థేయీ బహుమాన పూర్వయా సపర్యయా ప్రత్యుదియాయ పార్వతీ. ఇక్కడ ఈ పాదం మనం చదువుతుంటే యాయా అనే వర్ణం మూడు నాలుగు మార్లు ఆవృత్తి అవుతూ ఆవిడ ముందుకు సాగిపోతున్న దృశ్యం కళ్ళకు కడుతుంది. అస లావిడ తపశ్చర్య వర్ణించే టపుడు కూడా ఇలాటి దృశ్యమే ఒకటి మనకు దృగ్గోచర
Page 168