సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
శోక ఘనే - ప్రతియాత మివాంతిక మస్య గురోః - లోపల ప్రవేశించాలని చూచి ఆయన హృదయం దుఃఖంచేత దట్టంగా నిండి ఉంటే స్థలం లేదని తెలుసుకొని ఆ సందేశం మరలా వచ్చిన దారినే వెళ్ళిపోతున్న దని పిస్తున్నదట. మరి మానవుడి ఆలోచన లెలాంటివంటే అతటా: ప్రవావాః -ఇటూ అటూ ఒడ్డులేని ప్రవాహాలట. ఇంకా సున్నితమైన హృదయాన్ని కదిలించే ఎప్పటికీ మరపురాని వెన్నో భావాలు దొరలు తుంటాయి రచన లో. చిరస్య దృష్టివ మృతితేవ. అమ్మాయి పెండ్లి కూతు ర వుతున్నదంటే ఎంత మంది పిల్లలున్నా ఆవిడను చూచి ఎన్నో ఏండ్లూ పూండ్లూ అయినట్టు చచ్చి మరలా లేచి వచ్చినట్టు ఎంతో ఆప్యాయంగా చూచుకొన్నారట పార్వతీ దేవిని ఆ పర్వత దంపతులు. నిజమే ఒక మారు సతీ దేవిగా చచ్చి బ్రతికింది పరా పశ్యంతీ రూపంగా కనబడక ఎంతో కాలాని కిలా వైఖరీ రూపంగా గోచరిస్తున్నదే గదా ఆ జగన్మాత. అయినా తల్లికావిడ కన్నబిడ్డ. దూరమై పోతున్నదే అని బాధ. చేతికి కళ్యాణ సూత్రం కడుతూ కళ్ళలో నీళ్ళు తిరిగి కనపడక ప్రక్కన కడుతుంటే దాది దానిని పాటుకు తోస్తున్నదట. లక్ష్మణుడు రావణుడు ప్రయోగించిన శక్తి హృదయానికి సోకి నేలకొరిగితే అది సోకక పోయినా శోకంతో నేల కొరిగాడట రాముడు. ఇలా చెప్పుకొంటూ పోతే తెల్లవారుతుంది మనకు. సముద్రంలో నాలు గుద్దరణుల జల మందించాను తమకు. అందులో దిగి ఈత కొట్టటమిక మీ వంతే.
ఇంత వరకూ మన ముగ్గడించింది మహాకవి భావ సౌందర్యం. ఐతే భావ మొక్కటే కాదు. భాష కూడా ఉంది మనం గమనించ వలసింది. భావం భాషా - ఇవి రెండూ జోడు గుఱ్ఱాలు. రెండూ తోడైతేనే రథం ముందుకు సాగేది. ఇందులో భావం నిరాకారం. ఆభ్యంతరం. పోతే భాష సాకారం. బాహ్యంగా గోచరించేది. అమూర్తమైన భావాన్ని మూర్తం చేసి అంతరాంతరాల్లో మెదిలే భావాన్ని ఇదుగో ఇదీ పట్టుకోమని సహృదయుడి
Page 167