#


Index

చిత్రతరంగిణి

కనుకనే ఒకటి శ్రావ్యమైతే మరొకటి దృశ్యమయింది. రెంటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. సూక్ష్మమైనది శబ్దం, అది స్థూలీభవిస్తే రూపం. స్థూలమైన రూపం మరలా సూక్ష్మమైతే శబ్దతత్త్వానికే వస్తుంది. దీనిని బట్టి సంగీతమూ నాటకమూ పైకి వేరుగా కనిపిస్తున్నాయే కాని నిజానికి రెండూ అంత స్తత్త్వంలో ఒక్కటే. నాదం కనిపిస్తే నాటకం అవుతుంది. అభినయం వినిపిస్తే గీతమవుతుంది. శబ్దవివర్తమే జగత్తు. అది ద్రవదశలో ఉపకరిస్తూ ఉన్నంతవరకూ నాదం, ఘనీభవిస్తే రూపం అని కదా చెప్పాము. అందులో పూర్వదశ సంగీతం, పశ్చాద్ధశ నాటకం. కనుకనే రెంటికీ ఈ అవినాభావం.

  మొత్తంమీద విజ్ఞాన సంస్కారాలకు రెంటికీ దూరమైన లౌకిక జీవనంకంటే విజ్ఞానప్రదమైన శాస్త్రజగత్తు గొప్పదైతే, విజ్ఞానాన్ని కూడా మించి ఉత్తమ సంస్కారాన్ని అందజేసే కళా జగత్తు అంతకన్నా వాంఛనీయమైతే, అందులోనూ సకల కళాసారాన్ని ఆపోశనం పట్టిచూపే సంగీత నాటకాలు అత్యంతోపాదేయ మవుతున్నాయి. మానవుడికి, గ్రహణ శీలుడైన మానవుడి కింతకన్నా సంస్కారప్రదమైన స్థానాలు లేవు నిజానికి. అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటమే కళాధ్యేయమని చెప్పాము. ఈ ధ్యేయాన్ని పూర్తిగా అందుకోగలం మనమీ రెండింటినీ చక్కగా అవగాహన చేసుకోగలిగితే. సృష్టి అనులోమ విధానంలోగదా జరిగింది. అలాంటి సృష్టి రహస్యాన్ని ఆకళించుకోవాలంటే మరల మనం దానికి విలోమంగా ప్రయాణం సాగించవలసి ఉంటుంది. విలోమంగా సాగించినపుడే విశ్వధ్యేయాన్ని మనంమందుకోగలం. అందులో అనులోమం బిందు నాదకళలైతే దానికి విలోమంగా వ్యవహరించేటప్పుడు కళానాద బిందువులని వ్యవహరించాలి. పారమేశ్వరమైన శక్తి నాదాత్మకంగా వెలువడి ఆ నాదం జగదాకారంగా పరిణమించి కళ అయింది సృష్టిక్రమంలో మరలా ఈ జగద్వ్యవహారమంతా నాదరూపమై ఆ నాదం బిందురూపంగా పరిణమించి పరమేశ్వరునితో అభిన్నం కావాలి. శక్తి వ్యక్తిగా మారటం సృష్టి. అయితే వ్యక్తి శక్తిగా మారటం లయం. ఇది విశ్వకవి విషయంలో ఎలాగో తదౌరసుడైన కవి విషయంలో కూడా అంతే. కవి ఇచ్ఛయే బిందువు. అది అతడి మస్తిష్కంలో శక్తి రూపంగానే ఉంటుంది. అదే ప్రసరిస్తే శబ్దరూపాన్ని ధరించి సంగీత మనిపించుకొంది. ఆ శబ్దం

Page 94

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు