మరి ఇలాటి సమ్యగ్దర్శనానికి తోడ్పడే సాధనమేమిటని ప్రశ్న. సాధనమనేది ఎప్పుడూ దృష్టమే. సాధ్యమే అదృష్టం మనకు. దృష్టాన్ని పట్టుకొనే అదృష్టాన్ని అన్వేషించి పట్టుకోవాలి. అదే సిద్ధి. దృష్టం మనకీ ప్రపంచమైతే అదృష్టం దీని కధిష్ఠానమైన ఆ చైతన్యం. ఇది వాక్కైతే అది ఈ వాక్కు ద్వారా అందుకోవలసిన అర్ధం. లేదా పరమార్థం. అది ఇప్పుడూ సచ్చిద్రూపంగా ఈ నామ రూపాది విశేషాలలో పరచుకొనే ఉంది. అది ఉన్నా అతి సూక్ష్మమూ అమూర్తమూ కావటం మూలాన మససుకు రావటం లేదు. రాకపోగా నామ రూపాత్మకంగానే దర్శన మిస్తున్నది. అంటే అర్థం కూడా వాక్కులాగే అయిపోయిందన్నమాట. అంచేత వాగర్థాలు రెండూ వాక్కే ఇప్పుడు మనపాలిటికి.
ఇలాంటి ఈ వాక్కు ద్వారా మనమిప్పుడా పరమార్థాన్ని పట్టుకోవలసి ఉంది. అది ఈ నామ రూపాత్మకమైన వాక్కును తదాకారంగా భావన చేయటమే. నామరూపాలే వైఖరీ వాక్కని పేర్కొన్నాము. ఇదే ఆలంబన మయిందిప్పుడా పరమార్థాన్ని గ్రహించటానికి. ఇది క్రమ క్రమంగా తేలిపోతూ గదా దానిని మనకు భాసింప జేస్తున్నది. అంచేత ఈ వాక్కే దాని కాలంబనం. కనుకనే వాగర్థ ప్రతిపత్తయే అని ఘోషించటం మహాకవి. వాక్కుద్వారా అర్థం తాలూకు ప్రతి పత్తి ఏదో అది వాగర్థ ప్రతి పత్తి. అర్ధ ప్రతిపత్తి అంటే అర్ధాన్ని పట్టుకోటం. జగత్తు కంతా ఒకే ఒక అర్ధమా పరమార్థమే. దానినీ వైఖరి మొదలుకొని పర దాకా వ్యాపించిన వాక్కునే ఆలంబనం చేసుకొని అందుకోవలసి ఉంది.
అందుకే ఆ మహాఫలాన్నే నాకు ప్రసాదించమని వాగర్థ రూపంగా అన్యోన్య సంపృక్తులైన ఆ పార్వతీ పరమ్వేరుల నిద్దరినీ ప్రార్థిస్తున్నాడు కాళిదాసు మహాకవి. ఒకటి సాధనంగా మరొకటి సాధ్యంగా రెండూ వాంఛనీయాలే గదా సాధకుడికి. అందుకోసమవి రెండూ వందనీయాలే. వందే అనే మాట అందుకే. వందే అనే క్రియ ఆత్మనే పదం. ఆత్మనేపదిగా ప్రయోగించటం కూడా సాభిప్రాయమే. క్రియా ఫలం కర్తకు చెందితే ఆత్మనేపదమని వైయాకరణుల తీర్పు. ఇక్కడ కవి చేస్తున్న ఈ వందనం పార్వతీ పరమేశ్వరుల కని పైకి భాసిస్తున్నా వారెవరో గాదు. సాధకుడి కాత్మ స్వరూపులే. జగత్తు కంతా కూడా అదే ఆత్మ. ఒకే ఒక ఆత్మ చైతన్యం
Page 65