భీష్మద్రోణ లాంటి పద్యమూ చూడండి. ఎంత పకడ్బందుగా నడుస్తాయో. వీర భయానకాది రసాల కనుగుణంగానే సాగుతుందా రచన. అందులోనూ భీష్మద్రోణ పద్యమొక ఎత్తు దుర్వారోద్యమ ఒక ఎత్తు. భీష్మ ద్రోణలో నాలుగే సమాసాలు అన్నీ వచ్చీ పోయి ఒకే కొలతలో ఉన్నాయి. మొదటిది ముప్పాతిక పాదందాకా నడచి విరుగుతుంది. రెండవది అక్కడి నుంచి రెండో పాతిక ముప్పాతిక దాకా ప్రయాణం చేస్తుంది. ఇలా మజిలీలు చేసుకొంటూ పోవటం ఒక అందం ఉత్తరుడికి తెరలు తెరలుగా తోచే భీతాహాన్ని చిత్రిస్తుంది విరుపులతో కూడిన రచన. పోతే దుర్వారోద్యమలో రెండవ పాదం చాలా దూర మొక సమాసం గుక్క తిప్పుకోకుండా నడపి తరువాత మత్పతుల్ అని చిన్న మాట ప్రయోగిస్తాడు. అది పతుల సామర్థ్య మెలాంటిదో చూపటానికే దీర్ఘమైన సమాసం. ఇక వారు చేయబోయే పని చెప్పటంలో గిట్టిముట్టి అనీ మానం ప్రాణము అని జంట పదాలు ప్రయోగిస్తాడు. అక్కడ చదువుతుంటే వారి లాఘవమూ వేగమూ స్ఫురిస్తాయి.
అసలు ప్రాసాక్షరం తీసుకోటంలో కూడా ఉంది ఆయనగారి శిల్పం. భీష్మ ద్రోణలో ష్మా అనే ప్రాస ఉచ్చరించేటప్పుడు ఉత్తరుని భయాందోళనలుట్టిపడతాయి. అలాగే దుర్వారలో ర్వా అనే సంయుక్తాక్షరం ద్రౌపది పండ్లూ పెదవులూ నొక్కి పట్టి కచ్చగా కీచకుణ్ని బెదిరిస్తున్న దృశ్యం బయట పెడుతుంది.
అంతేకాదు. ఒకేపద్యంలో భావావేశంలో ఉండే గమనాన్ని బట్టి పద్య గమనం పాటించటంలో తిక్కనకున్న నేర్పు అనన్యాదృశం. చూడండి భవదాజ్ఞా దృఢబంధ అనే పద్యంలో మొదట సమాసం ఆరోహణలో నడుస్తుంది. సమాసం కూడా చాలా గాఢమైన కూర్చు ఇది ఏనుగులాంటి అర్జునుడి దృఢ పరాక్రమము అగ్రజుని ఆజ్ఞకు లోబడి ఉండే లక్షణమూ ప్రదర్శిస్తుంది. ఆ తరువాత నా డవలీలన్ మన యర్జున ద్విపము అనటంలో బంధం కొంత సడలిపోయింది. ఆ తరువాత మరలా దాన్ని క్రోధాన్ని వర్ణించేటప్పటికి క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగి అని దీర్ఘ సమాసం వచ్చింది. కౌరవ్యాం బుజశ్రేణి అనటంలో అల్లి బిల్లిగా అల్లుకొన్న తామర సరస్సును సూచిస్తుంది. సిక్కువడం జేయదే దగ్గరి నుంచి మరలా శిథిల బంధమే. అయితే క్కువర్ణ యమకం నిజంగా చిక్కుపడటాన్నే సూచిస్తుంది. అక్కడ ప్రాసస్థానంలో పదం విరగటం కూడా దీనికి ద్యోతకమే. మరి మౌళి స్రక్సంగ అనే పద్యంలో
Page 237