చివరదాకా ఒకే ఒక సమాసంతో నడపి చివర స్పీతు నాగేంద్ర కేతున్ అనే చోట సమాసాన్ని అంతం చేసి చిన్న సమాసాన్ని తునకలాగా అతికాడు కవి. అలా పోడిగించటంలో ఇలా అతకటంలో ఎంతో ఉంది మర్మం. దుర్యోధనుడి ఐశ్వర్యమెంత గొప్పదో సూచించటానికా దీర్ఘమైన సమాసం. చివరకది ఎలా హఠాత్తుగా అంతమవుతుందో చెప్పటానికీ విరుపు. దానికి కారణమేదో సూచించటానికా అతుకు.
ఇలా ఎంతైనా ఉంది రసానుగుణమైన పద్య రచనా శిల్పం తిక్కనలో. ఇంకా ఒక గొప్ప విశేషం కనిపిస్తుంది తరచి చూస్తే. ఒక రసం ఉదయించేటప్పుడు అది పుంజుకునే టపుడు పుంజుకొని పెద్దదయే టపుడు అంతకంతకు దాని పెరుగుదల ఏర్పడేకొద్దీ పద్యాలు కూడా పెరుగుతూ పోతాయి. భీముడు కీచకుడి దౌర్జన్యం తిలకిస్తూ కోపావేశం పొందినప్పుడు రచించిన పద్యాలే ఇందుకు తార్కాణం. మొదట కందం. తరువాత చంపకం. ఆ తరువాత సీస పద్యం వ్రాశాడు కవి. కోపం పెరిగే కొద్దీ ఛందస్సు కూడా పెరుగుతూ పోయింది. ఛందః పరిమాణం పెరగటంలోనే అతని కోపోద్రేకం సూచితమవుతున్నది. ఇలాంటిచోట ఒక పద్యంలో సమాప్తం కాదు వాక్యం మొదటిదాన్ని రెండవదానికి, రెండవదాన్ని దాటి మూడవదానికీ ప్రసరించి తరువాత ఆగిపోతుంది. భావం ఆగితే కదా వాక్యం ఆగవలసింది. భావమెందుకు ముగియదు. భావావేశం చల్లారక. అవిచ్ఛిన్నంగా కలిగే ఆ వేగాన్ని వ్యక్తం చేయటానికే ఇలాంటి రచన ద్రౌపదిని ఉపకీచకులు కట్టి శ్మశానానికి తీసుకుపోయేటపుడు ఆవిడ చేసిన ఆక్రందన ఆనతవైరి యోజయఅని ఒక ఉత్పలమాలలో వర్ణించాడు తిక్కన. శిబిక దూరంపోయేకొద్దీ తనపతులను సంబోధించే శబ్దంకూడ దూరదూరం సాగుతున్నట్టే నడుస్తుందా పద్యంలో శబ్దజాలం.
ఇది రసానుగుణమైన పద్య రచనా శిల్పం. పోతే ఇక దానికి దోహదం చేసే భావ శిల్పం. దీన్నిగూర్చి తిక్కన విషయంలో ఎంతయినా చెప్పవచ్చు. ఇంతెందుకు పై మూడు పద్యాలలో ఆయన వర్ణించిన భావాలే చాలు. అంతకన్నా కోపవర్ణనా సామాగ్రి మరొకటి లేదు. కనుబొమ లాడించటం, పండ్లుకొరకటం, కండ్లు మండిపోవటం, చెమట పట్టటం ఇలాంటివేకాదు. ముందుకు వెనుకకూ ఊగుతున్న భీముడి శరీరంకూడా వర్ణిస్తున్నాడు కవి. భయద స్ఫురణా పరిణద్ధ మూర్తియై అనే సమాసంలో గుప్తమై ఉంది భావస్ఫురణ అంతా. పోతే నేలా నింగీ తాళాలుగా చేసి
Page 238