#


Index

చిత్రతరంగిణి

వాయించటం, సముద్రాలేడూ ఇంకించి వాటి అడుగున ఉండే బురద దేహమంతా పులుముకోటం లాంటి భావాలు ఎంత సహజమైనవో అంత అతిలోకమైనవి. ఒక మానవుడికి కలిగిన కోపాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ చూపలేరు. మరొక ఉదాహరణ మిస్తాను చూడండి. ఉత్తర కుమారుడికి ఒక్కసారిగా కౌరవసైన్యాన్ని చూడగానే కలిగిన భయం కంపాదులను వర్ణిస్తాడు కవి. అక్కడ భయానక రసానికి కావలసిన సామాగ్రినంతా ఎలా ఒలకపోశాడో చూడండి. వెలవెల బారుచు వెగడొందు పెదవుల తీడియా నెంతయు తల్లడిల్లు, జల్లన నంగంబు లెల్ల నిండ జెమర్చు పదములు తరములు కుదియ వడకు, హృదయంబు తట తట నదరంగ బెలుకురు, ఇంతకన్నా భయాన్ని ఏకవీ చిత్రించలేడు. అలాగే కీచకులందరినీ భీముడు వధించి తన్ను కాపాడిన తరువాత సైరంధ్రి పురప్రవేశం చేసేటపు డామె పొంగి వచ్చే ఉత్సాహాన్ని ఎలా నిగ్రహించుకొంటూ వెళ్ళిందీ ఆవిడను చూచే జనులు పరస్పరం మందలించుకోటంలో ఎలా సతమతమయిందీ కవి వర్ణించటం చూస్తే ఆయన 'లోక స్వభావ పరిశీలనా ప్రాభవ మెలాంటిదో, అది ఎంతగా రసోపస్కారకమో మనకర్థమవుతుంది.

  ఇంతకూ కావ్య రసపోషణలో తిక్కనకు తిక్కనే సాటి. రసానికుండే విశ్వరూపాన్నే ప్రదర్శించాడా మహాకవి. అది మహాభారతాని కంతా కేంద్ర స్థానమైన విరాట పర్వంలోనే ఇంత వెల్లి విరిసి ఉంటే ఇక భారతమంతా ఎంతగా పనగలిసి ప్రవహించిందో చూడాలంటే అది సముద్రాని కేతమెత్తటమే. నానా రసాభ్యుదయోల్లాసి ఆ మహనీయుడు. ఆరు రసంబులన్.... మెల్ల కూరలున్. అని భీముడు చెప్పినట్టుగా వ్రాశాడే గాని నా దృష్టికిది భీముణ్ణి గురించి మాత్రమే కాదు. కవి తన్ను గురించి కూడా చెప్పినట్టు కూడా కనిపిస్తుంది. ఆరు రసాలు వండినట్టే నవరసాలు వండగలడు మహాకవి. అందులోనూ మామూలుగా అందరూ వండినట్టు కాదు. క్రొత్త క్రొత్త చవులు పుట్టేలాగా వండాలి. ఎప్పటికప్పుడు భంగులు మారాలి. అందులో విజ్ఞాన ముండాలి ఇలాంటి పాక రచనా కోవిదుడూ మరొకడు లేడనిపించాలి. దానికోసం సర్వశక్తులూ ధారపోయాలి. సోమయాజి ఆత్మకథే ఇది. నిజంగా రసనిర్మాణ ప్రపంచంలో ఇలాంటి సాధకుడు లేడు సిద్ధుడూ లేడు.

Page 239

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు