నోచుకోలేము. సంసార బాధలుపశమిస్తేనే శాంతి. సాయుజ్యం లభిస్తేనే సుఖం. ఈ రెండింటినీ మనకు ప్రసాదించటానికే భాగవత మసలు సృష్టి అయింది. వృత్రాసుర వధ ఎక్కడ ఉంటుందో గాయత్రీ మంత్రమెక్కడ వివరించబడుతుందో అది భాగవతమట. వృత్తాసురుడు మన బుద్ధుల నావరించిన ఈ సంసార బంధమే. గాయత్రీ మంత్రం బ్రహ్మాకారవృత్తే. అదే శుకనారదుల జీవిత సంకేతం.
3. భాగవతం మనకు భగవత్తత్త్వాన్ని నిరూపిస్తుంది. అది కృష్ణమూలం. దానికి ప్రయోజనం మోక్షమనే మహాఫలం. అది అందుకొని ఆస్వాదించ వలసినవారు సుమనస్సులైన సాధకులు. అందుకొనే సాధన శుకాలాపం లాంటి సద్గురూపదేశం. అన్నిటికీ మూలం భగవత్తత్త్వపరిజ్ఞానమే. మరి ఎవరా భగవంతుడంటే. శ్రీకైవల్యపదమది. కేవల నిరాకార సర్వవ్యాపకమైన చైతన్యం. నేను నేననే కేవల స్ఫురణ. అహంతారూపమైన ఆ జ్ఞానమే జ్ఞేయమైన ఈ జగద్రూపాన్ని ధరించింది. జ్ఞానం దాని స్వరూపమైతే జ్ఞేయం దాని విభూతి. ఇందులో మరలా అదే ప్రవేశించి ఆయా ఉపాధుల మేరకు జీవుడయింది. అది అంశి అయితే ఇది దాని అంశ. అదే విస్తరించి విభూతి అయి ప్రవేశించి అంశమయింది. కాబట్టి ఈ జీవజగత్తులు రెండూ దానికి భిన్నమే. అభిన్నమని వీటి రెండింటినీ భావన చేయటానికే భగవత్స్వరూప వర్ణనలూ - ప్రహ్లాదాది భక్తుల చరిత్రలూ - ప్రపంచ సృష్టిస్థితి లయాది వృత్తాంతాలూ - అన్నీ చోటుచేసుకున్నాయి భాగవతంలో, "ఇహతు పున ర్భగవాన శేష మూర్తిః, పరిపరితోను పదం కథాప్రసంగైః- ఏ కథ చూచినా ఏ పాత్ర చూచినా అదంతా ఒకే ఒక భగవత్తత్త్వమే ఆయా రూపాలలో వ్యక్తమై ఆయా కథల ద్వారా వర్ణించబడుతోందని గ్రహించాలి-దర్శించాలి- పాఠకుడు.
4. ఇలాంటి సమన్వయ దృష్టి ఉన్నవాడే భాగవత హృదయాన్ని పట్టుకోగలడు. వాడీ గ్రంధాన్నే కాదు-బృహద్గ్రంధమైన ఈ సృష్టినే భగవద్రూపంగా అకళించుకోగలడు. వాడే నిజమైన భాగవతుడు. ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తి తోడ వర్తించేవాడు. మాయ అంటే జీవజగదీశ్వరులనే భేదజ్ఞానం. అది ఇంచుక కూడా ఉండగూడదంటే అప్పటికంతా భగవద్రూపంగా దర్శించటం. ఆ దర్శనమే భక్తి. అది ఎప్పుడూ పాయకుండా తదనుగుణంగా జీవితం సాగిస్తే అనన్య భక్తి లేదా
Page 117