మున్నప్పుడూ కలిగితేనే దానికి దాఖలా. లేకపోతే శరీరపాతమైన తరువాత కలిగిందో లేదో మనకు ప్రమాణమేమిటి. అంతేకాక శరీరాదులు ముక్తికి సాధనాలు. సాధనం లేకుండా సాధ్యమెలా సిద్ధిస్తుంది. ఇంతదూరం ఆలోచించి మనవారు విదేహముక్తి తోపాటు జీవన్ముక్తినికూడా అంగీకరించారు. ఇహంలోనే ఈ శరీరంలో ఉండగానే తీవ్రమైన సాధన చేయగలిగితేచాలు ముక్తిని చూరగొన వచ్చుననే గొప్ప ఆశనూ ధైర్యాన్ని మన కందిచారు.
అన్నిటికన్నా చమత్కార మేమంటే అసలు మన హిందూ మత మన్నింటినీ ఒప్పుకొంటుంది. ఏదీ ఒప్పుకోదు. జీవుడూ దేవుడూ పుణ్యమూ పాపమూ లోకాంతరాలూ జన్మాంతరాలూ ఇవన్నీ చిలవలు పలవలుగా వర్ణించేది అదే. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగునని అన్నింటిని చివరకు హుళక్కి అని తేల్చి వేసేదీ అదే. ఇదే మన మతంలో ఉండే పరమాద్భుతమైన విషయం. పైకి చూస్తే ఇది పిచ్చి తరహాగా కనబడుతుంది. కాని లోతుగా దిగి చూస్తే ఇందులో ఎంత ఉపపత్తి ఉందో మన కర్దమవుతుంది. అంటే ఒక ఈశ్వరుడు సర్వదా సర్వదా సర్వత్రా ఉన్నదా ఈశ్వరతత్త్వమే-నని సిద్ధాంతంచేసి నప్పుడు మరొక పదార్ధ ముండటాని కాస్కారం లేదు గదా. లేనప్పుడీ జీవుడనీ - ప్రపంచమనీ లోకాంతరాలనీ జన్మాంతరాలనీ ఇవన్నీ ఎక్కడివి? వాస్తవంలో ఉండటానికి లేదు. కాని ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కనుక వ్యావహారికంగానే (Tentative-Hypo Thetical) ఉన్నాయవి. పారమార్థికంగా లేవు. భగవంతుడి దృష్ట్యా అది ఒకలీల. జీవుల దృష్ట్యా అజ్ఞానం. ఇదీ హిందూ మతం చేసిన పరిష్కారం. దీన్ని బట్టి అజ్ఞాన మెప్పుడంతరిస్తే అప్పుడీ సృష్టి దానివల్ల కలిగే నిరంతర క్లేశం కూడా అంతరిస్తుంది. ఇలాంటి అవకాశం హిందూ మతంలో తప్ప మరెక్కడా లేదు.
అసలు హిందూమత మనేది ఒక మతం కాదు. అది ఇస్లాము, బౌద్ధం, క్రైస్తవం లాగా ఆయా ప్రవక్తలు స్థాపిస్తే ఏర్పడింది కాదు. దానికి స్థాపకుడే లేడు. అది సనాతనం. ఋష్యాదులు కూడా ద్రష్టలే గాని స్రష్టలు కారు. ప్రవృత్తి నివృత్త్యాత్మకమైన వేద ధర్మాన్ని వారు దర్శించారు. తరువాత మనలాంటి మానవులకు ప్రబోధించారు. అంతమాత్రమే. అంచేతనే వేదవాఙ్మయాన్ని కూడా అపౌరుషేయ
Page 102