ముఖావలోకనము
శివతత్త్వం గుణీభూతమవుతుంది. కేవలం మన వివక్షను బట్టి కల్పించుకొన్న విభేదమే గాని ఇది వస్తు సిద్ధం గాదు . వస్తు తః రెండూ వేరు గావు. రెండని పేరేగాని రెండూ గలిసి ఒకే తత్త్వం. ఇదే శివశక్తి సామరస్యమంటే. అయితే శక్తి అనేది అస్వతంత్ర గదా అది ఎప్పుడూ శివతత్త్వ న్నాశ్రయించే గదా ఉండవలసింది అలాంటప్పుడు దానికి ఉపాసకు లెలా ఇచ్చారు ప్రాధాన్యమని అడగవచ్చు. దీనికొక ప్రబలమైన కారణమున్నది. అదేమంటే శక్తి ద్వారా నే ఎప్పటికైనా మనమాశివతత్త్వాన్ని అందుకోవలసి ఉంటుంది. మరోమార్గం లేదు. లోకంలో ఎక్కడైనా చూడండి. సాధనం ద్వారానే సాధ్యమనేది లభిస్తుంది. సాధనం లేకుండా ఏది గానీ ఆశించలేము. లోకంలో ఎలాగో లోకోత్తరమైన విషయంలోకూడా ఇదే వ్యవహారం. ఇక్కడ సాధ్యమనేది మానవులందరికీ ఒక్కటే. అది శివసాయుజ్యం. వాస్తవంలో మనమంతా శివస్వరూపులమే అయినప్పటికీ అనాది సిద్ధమైన మన అవిద్యా ప్రభావం వల్ల శివస్వరూపులమనే స్మృతి మనకు లేకుండా పోయింది. తన్నిమిత్తంగా సుఖదుఃఖాది రూపమైన ఈ సంసార బంధమేర్పడింది మనకు. దీనిలోనుంచి మరలా మోక్షమే కావాలని కోరితే దూరమైపోయిన ఆ శివతత్త్వాన్ని మనకందించే సాధనం వెతకి పట్టుకోవాలి. అలాటి సాధనమీశక్తి ఒకటి తప్ప వేరొకటి కానరాడు.
కానీ శక్తి ఒక్కటే మోక్షసాధనమని చెప్పటంలో ఉపపత్తి ఏమిటని సందేహించవచ్చు. శక్తి అనేది ఆ శివతత్త్వం నుంచే బయటికి ప్రసరించి వచ్చింది. ఏది దేనిలో నుంచి ప్రసరించి వస్తుందో అదే దాన్ని మరలా మనకందజేస్తుంది. చూడండి. సూర్యమండలం నుంచి
Page 2