ముఖావలోకనము
తేజస్సు భూమండలం దాకా ప్రసరిస్తూ వచ్చింది. ఎక్కడబడితే అక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇది ఏమిటా ఈ కనపడే తేజస్సని -మనం అన్వేషిస్తూపోతే అది మనదృష్టిని ఆసౌరమండలం వరకూ తీసుకెడుతుంది. కార్యమనేదెప్పుడూ దానికారణాన్నే మనకు జ్ఞాపకం చేస్తూ పోతుంది. ఇది లోకంలో మనకు సర్వత్రా తార్కాణమయ్యే విషయమే. ఒక ఘటం మృత్తికనూ పటం దాని తంతువులనూ వృక్షం దాని బీజమునూ మనసుకు తెస్తాయిగదా. ఇలాంటి కార్యకారణ భావానికి ఎన్నైనా ఉదాహరణలీయవచ్చు. ఎక్కడైనా కార్యాన్ని బట్టి కారణం ఊహించుకోలేకపోతే అది మన ప్రత్యభిజ్ఞాదౌర్బల్యమేగాని అక్కడ కారణ స్వరూపం లేక కాదు.
అంచేత ముందువర్ణించినట్టు శక్తి కూడా శివతత్త్వం నుంచి కార్య రూపంగా పరిణమిస్తూ వచ్చినదే. కనుక ఈ శక్తిని ఆలంబనం చేసుకొని సాధకుడు ప్రయాణం సాగిస్తే తప్పకుండా అతడా శివసాయుజ్యం పొందగలడనటంలో సందేహం లేదు. శివదూతీ అని అమ్మవారి నామావళి లో ప్రసిద్ధమైన నామమొకటి ఉంది. ఏమిటానామానికి అర్థం. ఒకదూతిక లాగా శివతత్త్వం దగ్గరి నుంచి వచ్చిందా శక్తి. ఎలాగని అడగవచ్చు. మొదట అది పరారూపంగా ఆ శివత్త్వంతో ఏకమై ఉండేది. అప్పుడు ఎలాటి స్పందమూ లేదు. నిర్గమనమంతకన్నా లేదు. ఆ శివతత్త్వమే నేనీప్రపంచాన్నంతా సృష్టించాలి అనేకమైపోవాలి అని ఎప్పుడు ఆలోచించిందో అప్పుడీశక్తి ఇచ్చారూపిణీగా ప్రసరించింది. అప్పుడు దానికి ప్రశ్యంతి అని పేరు వచ్చింది. అదే మరలా క్రియా రూపంగా ఈ ప్రపంచాన్ని సృష్టించాలని ప్రయత్నించే సరికి కొంత పైకుబికి
Page 3