నిమిత్తోపాదాన రూపంగా తానే ఉన్నాడు. అప్పుడే అది పురుష అంటే పూర్ణమనే మాట చెల్లుతుంది కూడా.
అదే వర్ణిస్తున్నాడిప్పుడు నారాయణ మహర్షి. ఏమని. పాదోస్య విశ్వాభూతాని. సమస్తమైన ఈ చరాచర ప్రపంచమూ నాలుగు పాదాలలో కేవలమొక పాదమే ఆ పురుషుడికి. అంటే అర్థం. ఉపాదానం కూడా తానే గనుక సమస్త భూతాల రూపంగా తానే ఇలా భాసిస్తున్నాదా పరమాత్మ. మరి ఇంతేనా ఇక్కడికే సమసిపోయాడా అంటే అలా కాదు మరలా. త్రిపాదస్యామృతం దివి. ఇంకా మూడు పాదాలున్నా యదనంగా. అవి ఈ సృష్టితో ఖర్చయి పోలేదు. అలా ఖర్చయి పోతే అది మృతం. మృతమంటే ఎప్పటికప్పుడు మారిపోయేది. మారుతూ మారుతూ చివరకు మాసిపోయేది. ప్రాపంచికమైన పదార్థాలన్నీ అలాంటివే. ఇది మన కనుభవ సిద్ధమే. మనమూ పోతున్నాము మనం చూచేదీ పోతున్నది. కారణం రెండూ విశేష రూపాలే. ఈ దృక్కూ విశేషమే. ఇది చూచే ఆ దృశ్యమూ విశేషమే. విశేషాని కెప్పుడూ నిలకడ లేదు. క్షణ క్షణ పరిణామ శీలం.
పోతే ఆ పురుష స్వరూపమీ జీవ జగద్రూపంగా ఒక వంతు మారుతున్నా మిగతా మూడు వంతులు మారకుండా అలాగే నిలిచి ఉన్నది. త్రిపాదస్య అమృతం దివి. ఇంకా మూడు పాదాలున్నా యదనంగా.
Page 66