#


Index

పరాంకుశే పాశ మభీతి ముద్రాం -కరైర్వహంతీం కమలాసనస్థాం - బాలార్కకోటి ప్రతిభాంత్రి నేత్రాం - భజేహ మంబాం జగదీశ్వరీం తాం -

  అంచేత ఇవీ అవీ గాక కేవలం మోక్ష ఫలాన్నే కోరి సేవించే ముముక్షువే అయితే మానవుడిలా భావించాలా మహాదేవిని. గొప్ప అంకుశమూ పాశము. అంటే రాగద్వేషాలని భావం అవే వరాలు. వాటితో పాటు అభయ మిచ్చే ముద్ర. ఇవన్నీ చతుర్భుజాలతో ధరించి చూపుతున్నది. సమస్త లోకాలూ అధిష్ఠించి కోటి సూర్య ప్రకాశంతో కనిపిస్తూ త్రినేత్రాలతో చూస్తున్నట్టు దర్శించాలా మూర్తిని. కోటి సూర్య ప్రకాశమా చైతన్య దీప్తి. తృతీయ నేత్ర మా చైతన్య స్థానమే. అది కావాలా నీకా రాగద్వేషాది ద్వంద్వాలు కావాలా అని మౌనంగా హెచ్చరిస్తున్నది మనలను. అవన్నీ కాదా చైతన్య ప్రకాశమే కావాలని కోరితే వాటి నుప సంహరించి దీనినే మనకు ప్రసాదిస్తుందని తాత్పర్యం.

సర్వమంగళ మాంగళ్యే - శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి - నారాయణి నమోస్తుతే

  కాబట్టి సర్వమంగళాలకూ నిలయమైన దామంగళ మూర్తి. కర్తవ్యోమహ దాశ్రయః అన్నారు. మిగతా కోరికలు కోరకుండా మానవుడీ జంజాటంలో నుంచి బయట పడేదెలాగా అని మోక్ష ఫలాన్నే కోరుకోవాలి. అప్పుడదే గాక దానితో పాటు ఇవి కూడా సంక్రమిస్తాయి మనకు.

Page 52