శ్రాతమూ స్మార్తమూ రెండూ తమ గురువుల దగ్గర చెప్పుకొంటున్నారే గాని చాలామంది శ్రోత్రియులు వాటి ఉచ్చారణ వరకే తప్ప విడిచి అర్థజ్ఞానం వైపు దృష్టి మళ్లించటం లేదు. వేద భాష్యమంతో ఇంతో పరిశీలించిన వారు కూడా మంత్రాలకు వాచ్యార్ధమే చెప్పగలరు గాని లక్ష్యార్థం దాకా దృష్టి పెట్టరు. అదే కరువయి నప్పుడు ఇక పరమార్ధం మాట చెప్పేదేముంది. అది మరీ దూరాపాస్తం.
వీరి పరిస్థితే ఇలా ఉంటే ఇక భాషా జ్ఞానమూ శబ్దార్ధ పరిజ్ఞానమే లేని మామూలు పారాయణ పండితుల సంగతి తడవనే పని లేదు. సంధ్యా వందన విషయ మెలాంటిదో ఇదీ అలాంటిదే. ఏదో యాంత్రికంగా మొక్కుబడి తీర్చినట్టు వల్లిస్తుంటారే గాని ఉచ్చారణ కూడా సరిగా ఉండదు. సరిగా లేకపోగా ఎవరో వెనకాల నుంచి తరుముకొని వచ్చినట్టు బ్రహ్మాండమైన వేగంతో ఒకరితో ఒకరు పోటీపడి చదువుతుంటారు. ఆ చదవటంలో ఎన్నో శబ్దాచ్చారణ దోషాలు కొంచెం సంస్కృత జ్ఞానమున్న నాబోటి వాడికే కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంటాయి.
ఇంతెందుకు. మంత్ర పుష్పం చదువుతున్నప్పుడు చాలామంది పురోహితులు చేసే ఒకటి రెండు పొరబాటు లుదాహరిస్తాను. గమనించండి. నీలతోయదమధ్యస్థా విద్యుల్లేఖేవ అని ఉంటే అక్కడ మధ్యస్థా ద్విద్యులేఖేవ అని ఉచ్చరిస్తారు.
Page 5