#


Index

  శివతత్త్వానికి దీన్ని అర్పణ చేయి శివాత్మకంగా దర్శన మిస్తుందని ఉపదేశించారు.

  తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః అని మంత్ర మలాటి ఉపదేశమే ఇస్తున్నది మనకు. ఈ బిల్వ వృక్ష ఫలాల నన్నిటినీ తపస్సుతో సమర్పించు. ఇక్కడ తపస్సు మన భావన. మన బ్రహ్మాకార వృత్తి. అలాటి జ్ఞాన బలంతో ఈ సంసారం వల్ల కలిగే సుఖ దుఃఖాది ఫలాల నన్నిటినీ పరమేశ్వరార్పణం చేయాలని భావం. తుభ్యమహం సంప్రదదే నమమ. నీకే ఇదంతా సమర్పిస్తున్నాను. నాకేమీ అక్కరలేదనే నిష్కామ దృష్టితో ఉండాలి మానవుడు. నుదంతు-అలాటి సజాతీయ భావాలే పోగొడుతాయి. వేటిని. విజాతీయమైన మాయాంతరాయాశ్చ అవిద్యా నిమిత్తంగా ఏర్పడ్డ ప్రాపంచిక వృత్తులను. ధియో యోనః ప్రచోదయాత్తనే మాట ఎంతో ఇదీ అంతే. విజాతీయ భావమేదీ పనికిరాదు. కారణం. బాహ్యా అది మనకు బాహ్యమైనది. బాహ్య ప్రపంచం వైపు లాక్కుపోతుంది. ఆంతరమైన తత్త్వాన్ని చూపదు. చూపితే అది లక్ష్మి. చూపకుంటే అలక్ష్మి. బాహ్యా అలక్ష్మీః అంటున్నా డిక్కడ మనకు భిన్నమైన దాన్ని చూపేదంతా అలక్ష్మే. మన మార్గాని కుపయోగ పడేది కాదు. అలక్ష్మీ ర్మేనశ్యతామని గదా ప్రార్థించా డింతకు ముందు. లక్ష్మిని సేవిస్తే అలక్ష్మి తొలగిపోతుంది.

Page 27