కాంతి కిరణాలేవో గావు. నాడులే. సూర్యకిరణాల లాంటివవి. సౌర కిరణాలలో వేడి ఉన్నట్టే వీటిలో కూడా రక్త గతమైన ఉష్ణ గుణముంటుంది. వీటి ద్వారా సంతాపయతి స్వం దేహం. శరీరాన్నంతా తపింప జేస్తున్నదది. తపింప జేయట మేమిటి. ఉష్ణ గుణాన్ని అన్ని అవయవాలకూ ఇంద్రియాలకూ పంచి పెట్టటం. తద్వారా అవన్నీ వేడెక్కటం. అలా కాకుంటే శరీరమే భాగానికా భాగం చల్లబడి పోతుంది. Temperature అంటే ఇదే. వెచ్చదనం. జీవచ్ఛరీర మెప్పుడూ ఎక్కడ తడవి చూచినా వెచ్చగా సోకుతుంది చేతికి. కారణ మక్కడ రక్తం ప్రసరిస్తుంటుంది. ఆ రక్తంలో వేడిమి ఉంటుంది. కాబట్టి అదే ఎక్కడంటే అక్కడ మనకు వేడిగా చేతిగా తగలటం. ఆపాద మస్తకమూ శరీరం వేడిగా ఉందంటే అది వేడి రక్తమంతటా ప్రసరించటం వల్లనే. అదే జీవలక్షణం. లేకుంటే నిర్జీవమే ఈ శరీరం. కనుకనే జీవుడికి తైజసుడని పేరు వచ్చింది. ఉష్ణో జీవిష్యన్ శీతో మరిష్యన్ అని వేదం చెబుతున్నది కూడా. బ్రతికున్నందుకు గుర్తు ఉష్ణత్వం చచ్చాడనేందుకు శీతలత్వమన్నారు. పోతే
తస్య మధ్యే వహ్ని శిఖా - అణీ యోర్ధ్వా వ్యవస్థితా - నీలతోయ దమధ్యస్థా - విద్యుల్లే ఖేవ భాస్వరా - నీవార శూకవ తన్వీ- పీతా భాస్వత్యణూపమా-
Page 157