కాబట్టి ఆహవనీయ మన్నారు దాన్ని. పోతే ముఖాగ్ని హోత్రంలో పడ్డ ఈ పదార్థ జాతమంతా మన జఠర గోళంలో చేరి అక్కడ పచన మవుతుంది. పచన మై రక్తంలో రసరూపంగా కలిసి హృదయాని కందుతుంది. కాబట్టి ఇలా వచనం చేసే జఠరాగ్నికి గార్హ పత్యమని పేరు వచ్చింది. గృహాని కంతా పతి ఇది. గృహమంటే శరీరం. పాతీతి పతిః దీన్ని శుష్కించి నశించి పోకుండా కాపాడేది కాబట్టి గార్హ పత్యమన్నారీ అగ్నిని. కాగా ఈ అగ్నిలో పచనమై రసరూపంగా రక్తంలో కలిసి హృదయంలో చేరే రూపంగా అభివ్యక్తమైన అగ్నిని దక్షిణాగ్ని అన్నారు. దక్షిణమేమిటి. హృదయం వామ భాగంలో గదా ఉందన్నారు. నిజమే అది వామంలోనే ఉన్నా దానికి నాలుగు ద్వారాలున్నాయి. అందులో దక్షిణం వైపున్న ద్వారంలో ప్రకటమయ్యే గుణం కాబట్టి ఇది దక్షిణాగ్ని అయింది. అన్వాహార్య పచన మని కూడా మరొక పేరు దీనికి. ఆహారం పచనమైన తరువాత తేజో రూపమైన ప్రాణశక్తిగా మారేది గనుక ఆ పేరు వచ్చింది.
ఇందులో ఒకటి ముఖం ఒకటి హృదయం మరొకటి జఠరం. మూడు ప్రదేశాలలో మూడున్నాయి ఈ అగ్నులు. ఇవి మూడూ ఒకే అగ్ని అయినా ఒక్కొక్క చోట ఉండి ఒక్కొక్క పని చేస్తుంటాయి. అదే వర్ణిస్తున్నాడిప్పుడు. సోగ్రభుక్ అది అగ్రస్థానంలో ఉండి భుక్ ఆహారాన్ని భుజిస్తుంటుంది మొదట. అప్పుడది ఆహవనీయం.
Page 155