- పూర్వార్ధము -
ఓమ్ - సహస్ర శీర్షగ్ం దేవం - విశ్వాక్షం విశ్వశంభువమ్ - విశ్వం నారాయణం దేవ - మక్షరం పరమం పదమ్
అ ఉ మ అనే మూడక్షరాలూ కలిసి ఓమయింది. అ సృష్టిని చెబితే మ లయాన్ని చెబుతుంది. సృష్టి లయాలకు రెండూ రెండు సంకేతాలు. మొదట లయావస్థలో ఉన్న ప్రకృతి ప్రపంచ సృష్టిగా మారింది. మ దగ్గరి నుంచి అ దాకా సాగింది. అది సృష్టి. పోతే ఇది సంసార బంధానికి దారి తీసింది. కాబట్టి మరలా మనం దానికి ప్రతిలోమంగా ప్రయాణం చేయాలి. చేస్తే దీన్ని ప్రవిలాపనం చేసుకొని ముక్తులం కాగలము. అలా జరగాలంటే అ దగ్గరి నుంచి మ వరకు ప్రయాణం చేయాలి. అప్పుడది ఓమ్మవుతుంది. అంతేకాదు మ అనే దాన్ని కూడా దాటి నిశ్శబ్ద స్థితి నందుకొన్నప్పుడే అది మోక్షం. మొదటి మూడూ అవస్థాత్రయానికి ప్రతీకలైతే నాలుగవ దశ తురీయ స్థితికి. అదే మోక్షం. అక్కడ ఇక ఓంకారం వినపడ గూడదు. అంతవరకూ అది ఆలంబనం. ఆ పిమ్మట ప్రవిలయం.
ఈ విధంగా భావిస్తే నిరాకారంగా ఉన్న తురీయ చైతన్యమే సాకారమైన అనస్థాత్రయంగా భాసిస్తున్నదని మరలా భావన చేసే కొద్దీ ఈ సాకారమైన చైతన్యమే నిరాకారమైన తురీయ స్థితిగా సాధకుడి అనుభవానికి రాగలదని అర్థమవుతున్నది.
Page 124