జంగమంగా సంచరిస్తూ. ఏమిటి ఎలా సంచరిస్తుంటాడు. ఆ సత్యేన రజసా ఇటు నుంచి అటు ప్రయాణిస్తుంటా దాకాశ మార్గంలో హిరణ్యయేన రధేన. బంగారు రధంలో తిరుగుతుంటాడట. బంగారు రథమా తళ తళ మెరిసే ఆయన మండలమే. భౌతికమైన మండలం వాహన మనుకొంటే దాని నధిష్ఠించిన దేవత సూర్య భగవానుడు. సూర్య భగవానుడేమో ఆ రధంలో కూచొని ఉన్నాడు రధికుడు. సూర్యమండల మాయన ఎక్కి కూచున్న రధం. అది బంగారు వన్నెతో ప్రకాశిస్తున్నది. సత్యేన. అది ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడూ. తిరుగుతూనే ఉంటుంది. సూర్యుడు తిరగడు. గ్రహాలే గదా ఆయన చుట్టూ తిరుగుతాయంటారు ఈనాటి శాస్త్రజ్ఞులు. నిజమే. ఈనాటి శాస్త్రజ్ఞులే మరలా ఏమంటున్నారో తెలుసా. అసలు తిరగని పదార్ధమంటూ ఏదీ లేదు. అణువు మొదలు ఆకాశం వరకూ అన్నీ పరిభ్రమిస్తూన్నవే. సృష్టిలో పరమాణువు అతివేగంగా తిరుగుతున్నదని ఆకాశం కూడా ఇంకా పెరిగి పోతున్నదని వీరే అంటున్నారా లేదా. అంచేత వేద ఋషులు ఆ రోజుల్లోనే ఈ సత్యం బయట పెట్టారంటే ఎంత గొప్పో చెప్పండి.
కాబట్టి సత్యమంటే ఎప్పుడూ ఉండేదే గాక ఎప్పుడూ దెబ్బ తినదు. కుంఠితం కాదట ఆరధం. రజసా- కదులుతూనే ఉంటుందది ఎప్పుడూ. నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది గదా. ఆ వర్త మానః - దానిలో కూచొని రాకపోకలు చేస్తూనే ఉంటుందా దేవత.
Page 95