#


Index

   ఆ వేదార్థం కూడా వాచ్యార్థం కాదు. అంతరార్ధం కూడా కాదు. రెండింటినీ మించిన పరమార్ధం. అందుకే నహ్యన ధ్యాత్మ విత్కశ్చి త్రియా ఫలము పాశ్నుతే అని మనువు తెగేసి చెప్పాడు లోకానికి. పరమార్ధ జ్ఞానం లేకుండా నీవక్కడి కక్కడే ఎన్ని అర్థాలు చెప్పుకొన్నా లాభం లేదు. నీవు చేసే కర్మలకు సమగ్రమైన ఫలాన్ని నీవు ఆసించలేవని చాటి చెప్పాడాయన. బాహ్యార్థం కేవల మీకర్మ స్వరూపాన్ని దాన్ని ఆచరించే విధానాన్ని చెబుతుంది. అంతరార్థ మాయా కర్మ లేయే దేవతల నుద్దేశించి చేస్తున్నావో వాటి స్వరూప ప్రభావాలను మాత్రమే ఏకరువు పెడుతుంది. అంతేగాని వాటికతీతమైన తత్త్వాన్ని చెప్పలేదు. అదే అధ్యాత్మ మని మనువు పేర్కొన్నది. పరమార్ధ మదే జీవితానికి. మిగతా అర్థాలు అర్థాలు కావా అంటే కావచ్చు. కాని ఎంతవరకో అంతవరకే. పరిచ్ఛిన్నమవి. పరిపూర్ణం కావు.

   పరిపూర్ణమైనది ఒక్క పరమార్ధమే. ఎక్కడ ఉందది. ఎక్కడ అని ప్రశ్నే లేదు. సర్వత్రా ఉన్నది. అద్వితీయమది. ద్వితీయముంటే అది సార్వత్రికం కాదు. అలాటి అద్వైత భావమనేది ఒక్కటే పరిపూర్ణం. అందులోనే మిగతా అర్థాలూ శబ్దాలూ అన్నీ చేరిపోతాయి. అసలు ప్రపంచ మంతా అదే వ్యాపించినప్పుడు శబ్దమనీ అర్థమనీ తేడా ఏముంది. భౌతిక ప్రపంచమంతా అదే. వేద వాఙ్మయమంతా అదే. కర్మకాండ అంతా అదే. దానివల్ల ఉపాసించే దేవతలూ దేవలోకాలూ అదే.

Page 9