వాటి అర్థం కూడా తమకు తోచినట్టు వ్రాసి పారేస్తున్నారు. పదిమందీ చదువుకొంటున్నారు. మనమొక వేళ మడిగట్టుకొని కూచున్నా పాశ్చాత్య పండితు లూరుకోరు. తమ భాషల్లోకి అనువదించారు. అనువదిస్తున్నారు కూడా. అంతే కాదు. గాయత్రి దగ్గరి నుంచి మంత్రాలన్నీ వద్దని చెవులు మూసుకొన్నా మైకులలో వినిపిస్తూనే ఉన్నాయి ఎక్కడబడితే అక్కడ. దానికేమంటారు మీరు. అనధికారులైన Incompetent వారి చెవిన పడగూడదని గదా గోప్యంగా ఉంచమన్నారు. అనధికారులు విన్నా పరవాలేదు. వారి కర్ధం కాదు కాబట్టి. అర్థం కూడా వ్రాశారు గదా అంటే అది కేవలం వాచ్యార్థమే. దానితో తృప్తి పడే బాపతే కాబట్టి అప్పటికీ భయం లేదు.
ఇంతెందుకు. సాయనాచార్యుల లాంటి మహనీయులు వ్రాసిన భాష్యగ్రంధ ముందా లేదా నాలుగు వేదాలకూ. అది చాలా మంది వేదజడులు చూడకపోయినా దాని గంధమంతో ఇంతో ఉన్న వేద పండితుల కది విదితమే గదా. కాని బాహ్యార్ధ జ్ఞానమే అది. అంతరార్ధం వాళ్ళకూ తెలియదు. వీళ్లకూ తెలియదు. వాచ్యార్థం అంతరార్థం పరమార్ధమని అసలు అర్థమనేది మూడు భూమికలు. ఎక్కడికక్కడ ఆగిపోతే సుఖం లేదు. పరమార్ధం దాకా ప్రయాణం చేయాలి పాఠకుడు. నా వేదవిన్మను తేతం బృహంత మన్నారు. వేదార్ధ జ్ఞానం లేకుండా సర్వవ్యాపకమైన బ్రహ్మతత్త్వాన్ని ఎవడూ అర్ధం చేసుకోలేడట.
Page 8