#


Index

   దీనిబట్టి పదక్రమ జటాఘనలు చెప్పుకొని మహా పండితులమని విర్రవీగే చాలామంది వేద పండితులు కూడా ఎంత పండితమ్మన్యులో మీరే ఊహించవచ్చు. వారు వేద మీ మూల నుంచి ఆ మూల వరకూ చిలుక పలుకులాగా వల్లె వేస్తున్నారే తప్ప అంతకన్నా ఏమీ లేదు. అదేమిటి. ఉదాత్తాది స్వరంతో చదువుతుంటారు గదా. ఇటూ అటూ తిప్పి తిప్పి పదాలు శ్రావ్యంగా చదువుతారు గదా అంటే దానికి మనం మూర్ఛపో నక్కర లేదు. పూర్వకాలంలో అచ్చు యంత్రాలు లేవు. కాగితాలు లేవు. అంచేత వేద మంత్రాలు కంఠస్థం చేయవలసి వచ్చింది. ఆ చేసేటపుడవి ధారణలో నిలవాలంటే స్వరం మార్చి అటూ ఇటూ ఒకే మాట పలుమారు ఉచ్ఛరిస్తూ అవి కంఠస్థమయ్యే దాకా సాధన చేస్తూ వచ్చారు. అందుకోసం వచ్చిందీ ఘనాంత స్వాధ్యాయ మంతా. వినటానికి శ్రావ్యంగానే ఉంటుంది. సందేహం లేదు. సంగీతంలో ఒక చరణం పదే పదే సంగతి మార్చి పాడుతుంటే శ్రావ్యంగా ఉండటం లేదా. అలాగే ననుకోండి.

   ఆకాలంలో నంటే అది అనివార్యమయితే కావచ్చు గాని. ఇప్పుడీ కాలంలో కూడా అలాగే చర్విత చర్వణంగా చేస్తూ పోతే ఏమి బాగు. అది కాదండీ మంత్రాలు చాలా గోప్యంగా ఉండాలి. అవి బాహాటం చేయటం మహాపచార మంటారా. ఈ రోజుల్లో అనవలసిన మాట కాదది. వేదాలన్నీ ఇప్పుడచ్చు వేసి పుస్తకాలు పంచి పెడుతున్నారు.

Page 7