ముక్తా విద్రుమ హీను నీల ధవళ చ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణై - ర్యుక్తా మిందుని బద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికామ్ - గాయత్రీం వరదాభయాంకుశ కశాః శుభ్రం కపాలం గదామ్ - శంఖం చక్రమథార వింద యుగళం హస్త్రైర్వహంతీం భజే -
ఆ గాయత్రీ దేవతను నేను భజిస్తాను. ఎలాటి గాయత్రీ అంటే యుక్తాం. వీటన్నిటితో కూడు కొని ఉన్న దామూర్తి. ఏమిటివి. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ చ్ఛాయై ర్ముఖైః - అయిదున్నాయా విడకు ముఖాలు. ఆ ముఖాలొకటి ముత్యం. ఒకటి పగడం. ఒకటి బంగారం. మరొకటి నీలం. నల్లరాయి. ఇంకొకటి ధవళం- తెల్లరాయి. అంటే వజ్రం. ఈ అయిదు రంగుల్లో ఉన్నాయి. ఈ అయిదూ పృధి వ్యాది పంచభూతాలకు సంకేతాలు. పంచభూతాలే పంచముఖాలు గాయత్రికి. ముఖమంటే ద్వారం. ఈ పంచ భూతాల ద్వారా ఆ పరాశక్తి వైఖరీ రూపంగా మనకు ప్రకటమై కనిపిస్తున్నది. కాబట్టి వీటి నామె ముఖాలుగా భావించి వర్ణించారు పెద్దలు. త్రీక్షణైః మూడు నేత్రాలా విడకు. ఇదీ సంకేతమే. మనోబుద్ధ్యహం కారాలే నేత్రాలు. కాగా బాహ్యంగా కనిపించే అయిదు భూతాలూ ఆభ్యంతరంగా వాటిని కనే మూడు దృష్టులూ అయిదూ మూడూ కలిసి ఎనిమిది. వాటినే అష్టమూర్తులన్నారు. అమ్మవారి కష్టమూర్తి అవి ఒక నామం. అష్టమూర్తి రజా జైత్రీ.
Page 83