#


Index

సంధ్యావందనము

ఉత్తరార్ధము

   ఇక్కడికి పూర్వార్ధ మయింది మన ప్రయాణంలో. ఇక ఉత్తరార్ధంలో ప్రవేశిస్తున్నాము. ఏమని చెప్పామింతకు ముందు. గాయత్రీ జపం యధాశక్తిగా 108 మార్లో 1000 మార్లో చేయటం మంచిదని చెప్పాము. అది మౌనంగా చేయాలి మనం. ఆ తరువాత దిగ్విమోకం చేయాలి. అంతకు ముందు చేసిన దిగ్బంధాన్ని సడలించాలని అర్థం. దిగ్బంధమంటే చూపుడు వేళ్లు రెండూ మెలిక వేయటం. దిగ్వి మోకమంటే మెలిక సడలించటం. ఇవి రెండూ కేవలం సంకేతాలు. ధ్యానం చేసేటపుడు మన ఇంద్రియాలూ మనస్సూ అటూ ఇటూ ప్రసరించి బహిర్ముఖం కాకుండా పోవటానికి సంకేతం దిగ్బంధమైతే అవి అంతర్ముఖమై పరమాత్మ వైపు మళ్లటానికి సంకేతం దిగ్విమోకం - అప్పుడు అన్ని దిక్కులలో పరమాత్మే మనకు గోచరిస్తాడు. ఇది అయిన తరువాత ఆ పరాదేవతా స్వరూపాన్ని మనసా ఎలా భావించాలో ధ్యాన శ్లోకం మనకు బయట పెడుతుంది. అది వాచా ఉచ్చరిస్తున్నా మనసా దాని అర్ధాన్ని భావన చేస్తూ పోవాలి. నిర్గుణమైన తత్త్వాన్ని సగుణ భూమికకు తెచ్చి దాన్ని మనోనేత్రంతో దర్శించాలి. ఎలాగ.

Page 82