మిగతా వృత్తులన్నీ ప్రచోదనం చేసి బ్రహ్మకార వృత్తినే ధ్యానించినప్పుడు మన మవస్థాత్రయాన్ని దాటిపోతాము. అదే సన్న్యాసం. అప్పుడు తురీయా వస్థలో ఉంటుంది మనస్సు. ఉన్నప్పుడా దివ్యశక్తి ఎలా కనిపిస్తుంది మనకు. వాగ్భూత పృధ్వీ శరీర హృదయ ప్రాణాలనే ఆరు స్థానాలనూ వ్యాపించి కనిపిస్తుంది. అంటే మన పిండాండమూ బ్రహ్మాండమూ అంతా అదే. అలాగే పంచశీర్షా. అయిదు శిరస్సలంటే పృధి వ్యప్తేజో వాయ్వా కాశాలనే పంచ భూతాలూ అదే. విశ్వతో ముఖంగా మన కభిన్నంగానే దర్శన మిస్తుంది. కనుకనే ఉపనయనే వినియోగః ఉపనయన మంటే బ్రహ్మచారిని గురువు దగ్గరికి తీసుకు వెళ్లటం. ఎందుకు. ఆయన ద్వారా వీడు బ్రహ్మోవ దేశం పొందటానికి. గాయత్రీ మంత్రోపదేశమే బ్రహ్మోపదేశం. ఉపనయన కాలంలో పురోహితుడు దాన్నే మన కుపదేశిస్తుంటాడు. అంటే అర్థం. బ్రహ్మతత్త్వాన్ని చేరటానికి మార్గం చూపుతున్నాడు. అదీ అసలైన ఉపనయనం. గురువు దగ్గర చేర్చట మొక ఉపనయనమైతే ఆయన మంత్రోపదేశం ద్వారా జీవిత గమ్యాన్నే చేర్చట మొక ఉపనయనం. మొదటిది బాహ్యం. రెండవది ఆంతర్యం. అదే ఈ గాయత్రికి వినియోగం. ఉపనయనంలోనే దానికి వినయోగం. అంటే అదీ దీని ప్రయోజన మని తాత్పర్యం.
ఏతావతా గాయత్రీ మంత్రాధి దేవతను సాంగోపాంగంగా మనమీది కావాహన చేసుకొంటూ వచ్చాము. దాని యావదర్థాన్నీ కూడా మనసా ఆకళింతకు తెచ్చుకొన్నాము.
Page 77