మన వర్ణ మావిడ వర్ణమే. మన నలుపూ తెలుపూ అంతా కలిసి శ్వేత వర్ణా. తెల్లని తెలుపుగా మారుతుందా విడకు. శ్వేత వర్ణమంటే శుద్ధ సత్త్వమని అర్థం. సాంఖ్యాయన సగోత్రా సాంఖ్యాయన మహర్షి గోత్రంలో జన్మించిందట. సాంఖ్యమంటే జ్ఞానం. దాని కయనం నిలయమైనది సాంఖ్యాయనం. అదే ఆవిడ గోత్రం. అంటే అఖండమైన బ్రహ్మజ్ఞానం. చతుర్వింశ త్యక్షరా. ఇరవయి నాలుగక్షరాలు గాయత్రీ ఛందస్సుకు. తత్సవితుర్వరేణ్యం - 8. భర్గో దేవస్య ధీమహి - 8 ధియోయోనః ప్రచోదయాత్ - 8. వెరసి 24 అక్షరాలు. ఇది ఏవో గావు. మహాభూతాల దగ్గరి నుంచి శబ్ద స్పర్శాది పంచతన్మాత్రల వరకూ వ్యాపించి ఉన్న 24 తత్త్వాలే. వాటికి సంకేతమే ఈ అక్షరాలు. త్రిపదా - మూడెనిమిదులూ కలిసి ఇంతకూ మూడు పాదాలే. త్రిపదా అంటున్నాడు. నాలుగవ పాదమేమయినట్టు. పద్యానికి నాలుగు పాదాలుండాలి గదా. ఉంది నాలుగవ పాదం. గుప్తంగా ఉంది. దాన్నే గుప్త గాయత్రి అంటారు. సన్న్యాసులకు పనికి వచ్చేదది. ఏదో గాదు. పరోరజసి సావదోమ్. రజో గుణాని కతీతమైన దశలో ఉన్నదా శక్తి. సా అవతు అది మనలను రక్షించాలని అర్థం. ఆ ఎనిమిదీ కలిస్తే 32 అక్షరాలు నాలుగు పాదాలూ సరిపోతాయి గాయత్రీ ఛందస్సుకు. ఏమిటి దంతా. ఛందో రూపంగా కనిపించేది పరా దేవతే నని గదా ముందు నుంచీ చెబుతూ వచ్చాము.
Page 76