కాబట్టి పరమాత్మే దీని స్వరూపం. సాయుజ్యే వినియోగః
మరి దీనికి వినియోగ Utility మెక్కడ అని ప్రశ్న. అది పరమాత్మ సాయుజ్యమే మరేదీ గాదు.
ఏ మంత్రానికైనా దేవత ఋషి ఛందస్సు స్వరూపమూ వినయోగమూ ఇవన్నీ ఉండి తీరాలి. మంత్రానికి వన్నీ అంగాలు. ఈ అంగాలతో కూడిన అంగి ఆ మంత్రం. మననాత్రాయతే ఇతి మంత్రః - అది పైకి శబ్ద రూపంగా ఉచ్చరించటం వ్యాహృతి అయితే అర్ధరూపంగా భావన చేస్తూ పోతే అది ధ్యానం. కాగా అన్నిటి కన్నా గొప్ప అర్ధమేదుందో అది పరమార్ధమన్నారు. అది కేవలం పరమాత్మే. అలాటి పరమార్ధాన్నే బోధిస్తున్నదీ గాయత్రీ మంత్రం. దీని ప్రయోజనం కూడా ఐహికమైన అర్థకామాలు కాదు. ఆముష్మికమైన ధర్మమూ కాదు. కేవలం మోక్ష పురుషార్ధమే. కనుక మిగతా మంత్రాలన్నిటి కన్నా చాలా గొప్ప మంత్ర మీ గాయత్రి ఒక్కటే. నగాయత్ర్యాః పరోమంత్రః అని దీనికే పట్టాభిషేకం చేశారు ధర్మశాస్త్రజ్ఞులందరూ. అంతే కాదు. జప్యే దన్యన్నవా జప్యే న్మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. ఇంకొక మంత్రం జపించినా జపించక పోయినా మునిగి పోయిందేమీ లేదు. మైత్రః మిత్రుడంటే సవిత సూర్యుడు. సూర్యుడికి సంబంధించిన ఈ గాయత్రిని జపిస్తేనే వాడు బ్రాహ్మణుడవుతాడు. అని స్పష్టంగా చాటించారు కూడా పెద్దలు.
ఇలాటి గాయత్రీ దేవత నా వాహన చేస్తున్నా డుపాసకుడు. ఎలాగని.
Page 69