ఉద్యంత మస్తం యంత మాదిత్యం - అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో - విద్వాన్ సకలం భద్రమశ్నుతే- అసా నాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద -
ఎలా భావన చేయాలో ఆ సూక్ష్మాన్ని కూడా వివరిస్తున్నాడు ఫలశ్రుతి వ్యాజంతో మహర్షి ఉదయిస్తున్న అస్తమిస్తున్న ఆదిత్య మండలాన్ని మనసులో ధ్యానం చేస్తూ బాహ్యంగా కూడా ఆచరిస్తూ బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకొన్న జ్ఞానశీలుడు సమస్తమైన శుభాలూ జీవితంలో పొందగలడు. జీవితాంతంలో బ్రహ్మ సాయుజ్యాన్నే చెందగలడు. అది కూడా ఏదో క్రొత్తగా పొందుతాడని కాదు. బ్రహ్మ మనేది మనం ధ్యానిస్తే తయారయ్యేది కాదు. లేదా మనమంతకు ముందు అది కాకుండా క్రొత్తగా అయ్యేదీ కాదు. మొదటి నుంచీ ఉన్నది. ఎప్పుడూ ఉంటుంది. అదే సత్యమంటే. అది తనపాటి కెక్కడో ఉంటుందని కూడా కాదు. మన స్వరూపం కూడా అదే. అయితే గుర్తింపు లేక దెబ్బ తిన్నాము అది ఇప్పుడు గుర్తించా మంత మాత్రమే. ఈ గుర్తించటమే పొందటమనే మాట కర్ధం. అదే చెబుతున్నాడు మహర్షి బ్రహ్మైవసన్ బ్రహ్మ స్వరూపుడయ్యే ఈ జ్ఞాని బ్రహ్మాప్యేతి బ్రహ్మంతో ఏకమవుతున్నాడు. అయితే యఏవం వేద. బ్రహ్మమే అయినా అది వస్తు తంత్రమే గాని బుద్ధి తంత్రం కాదు. ఎవడలా తన బుద్ధితో గ్రహిస్తాడో వాడే బ్రహ్మ మవుతాడని భావం. జ్ఞానం లేకుంటే అనుభవం లేదెప్పుడే గానీ. అసా వాదిత్యో బ్రహ్మ.
Page 66