అప్పుడే పరిపూర్ణమైన శౌచం మానవుడికి యదుచ్ఛిష్ట మభోజ్యం - మధ్యాహ్న మంత్రం గదా ఇది. ఆపాటికి భోజనం చేసి ఉండవచ్చు. ప్రాతఃకాలంలో భోజనం లేదు. సాయంకాలంలో మధ్యాహ్న భోజన మెలాగూ జీర్ణమయి ఉంటుంది. ఆ రెండు సంధ్యలలో లోపల ఏ పదార్ధమూ ఉండదు. మాధ్యాహ్నిక సంధ్యలో ఏదో కొంత ఆహారం శరీరంలో ఉంటుంది. అందులో యదుచ్ఛిష్టం అభోజ్యం. ఏది భుజించ గూడదో అదీ - అలాగే ఏది పనికిరానిదో అదీ భుజించి ఉంటే. యద్వా దుశ్చరితం మమ - ఏవైనా చెడ్డ పనులు చేసి ఉంటే. సర్వం పునంతు మా మాపః - అదంతా ఈ ప్రోక్షణ చేసుకొంటున్న జలం నన్నూ దాన్నీ పరిశుద్ధం చేయుగాక. అసతాం చ ప్రతి గ్రహగం స్వాహా. అలాగే అపాత్రులూ అయోగ్యులైన వారి వద్ద ఏదైనా స్వీకరించి ఉండవచ్చు నేను. ఎక్కడైనా దానం పట్టి ఉండవచ్చు. దానం పట్టేటపు డిచ్చే వాడు పాత్రుడై ఉండాలి. అది పుచ్చుకొనే వాడూ పాత్రుడయి ఉండాలి. అలా కాక అనత్ప్రతి గ్రహం చేసి ఉన్నట్టయితే దానివల్ల సంక్రమించిన మాలిన్యం కూడా తొలగి పోవుగాక. ఇక్కడ అసత్ప్రతి గ్రహమంటే అయోగ్యుల వల్ల దానం పుచ్చుకోటమే గాక అసద్గుణాలను గట్టిగా పట్టుకొని కూచోటమని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైనా హేయమే. ఉపాదేయం కాదు. హేయమైన అసుర గుణాల నన్నింటినీ తొలగించుకొని దైవ గుణాలను భావిస్తూ వాటినే మనసులోకి చేర్చుకోవాలని స్వాహా అనే మాట కర్థం.
Page 53