#


Index

   కనుక మమోపాత్త నేను పోగు చేసుకొన్న దురిత - పాపకర్మలన్నీ క్షయ ద్వారా - నశించి పోవాలంటే ప్రాత స్సంధ్యాంగ - ఈ ప్రాతర్మాధ్యాహ్ని కాది సంధ్యామ్ దేవ తను ఉపాసిష్యే ఉపాసన లేదా ధ్యానం చేస్తున్నా ననుకోవాలి. అది కూడా ఏదో కావాలని ఫలకామ నతో కాదు. పరమేశ్వర ప్రీత్యర్థం. సర్వ వ్యాపకమైన ఆ పరమాత్మ స్వరూపాన్నే దీని ద్వారా స్మరిస్తూ దాని ప్రీతి కోసమే ఇదంతా ననే నిష్కామ బుద్ధితో ఆచరించాలి. అలాగైతేనే పాత్ర కూడా శుద్ధి చెందుతుంది.

   ఇక్కడికి దేశకాల పాత్రలు మూడింటికీ పరిశుద్ధి ఏర్పడింది. ఏర్పడిందంటే అవి వస్తుతః ఎప్పుడూ పరిశుద్ధమే - నిత్య శుద్ధం గదా పరమాత్మ. అదే గదా సమస్త దేశకాల వస్తువులనూ వ్యాపించిన తత్త్వం-కాబట్టి నీవను కొన్నా అనుకోక పోయినా వాటి పాటికవి పరమాత్మ స్వరూపమే కాబట్టి నిత్యమూ పరిశుద్ధమే. కాని త్రిగుణాల కధీనమై జీవిస్తున్న మన కలాటి చూపు లేదు కాబట్టి వస్తు సిద్ధమైనా అది మనకు బుద్ధి సిద్ధం కావటం లేదు. దాన్ని బుద్ధి సిద్ధం చేసుకోటానికే ప్రస్తుత మీ దేశకాలాది పవిత్రతా భావన లేదా సంకల్పం. ఇందులో ఇమిడి ఉన్న రహస్య మేమంటే వ్యష్టి ఎప్పుడూ వ్యష్టి మేరకే చూపు పెట్టుకొంటే తరించ లేడు. సమష్టి దృష్టితో బ్రతకాలెప్పుడూ. సమష్టి దృష్టి వ్యష్టి నంత కంతకూ సమష్టి స్థాయికి తీసుకెళ్లుతుంది. దానివల్ల పరిశుద్దీ పరిపూర్ణతా ఏర్పడుతుంది మనస్సుకు.

Page 42