అలా చెదురు మదురుగా ప్రధమమంటే నాలుగు పాదాలుండి అందులో మొదటిదని చాలామంది అభిప్రాయం. కాని అది పొరబాటేమో అనిపిస్తుంది నాకు. పాదాలనేవి యుగాలకు కాదు. ధర్మానికి. ధర్మమనే దానినొక ధేనువుతో పోల్చారు. గోవుకు నాలుగు పాదాలున్నట్టే ధర్మానికీ నాలుగున్నాయి పాదాలు. అవేవో గావు. సత్య త పో దయా దానాలు. నాలుగు పాదాలతో నడిస్తే అది కృత యుగం. అందులో సత్యమనేది ఒకటి తక్కువై మూడింటితో నడిస్తే అది త్రేతా యుగం. త్రేతా అంటే అసలు మూడనే అర్థం. సత్యమూ తపస్సూ రెండూ కొరత పడితే ద్వాపర. ద్వా అంటే రెండనే అర్థం. దయా దానం రెండే ఉంటాయప్పుడు. అందులో కూడా దయ పోయి దానం మిగిలితే అది కలి. కలి అంటే కలహమని అర్థం. అన్నీ పోయి ఒక్కటే మిగిలితే కలహం కాక మరేముంది. అందుకే ప్రస్తుత మన్ని దేశాలూ పరస్పర కలహంతో కొట్టుకు చస్తున్నారు. సర్వ నాశన మవుతున్నారు. అదీ పోతే ఇక యుగాంతమే సందేహం లేదు. కాలమానాన్ని బట్టి చూచినా సరిపోతుంది ఈ విషయం. కనుక ప్రధమ పాదమంటే ఏకపాద మనే నా అభిప్రాయం.
పోతే ఇందులో వర్తమాన అంటే నడుస్తున్నది చాంద్రమానం. సౌర మానం చాంద్ర మానమని రెండున్నాయి. మానమంటే కొలత. సూర్యుణ్ణి బట్టి ఒకటి చంద్రుణ్ణి బట్టి ఒకటి. మనకు మామూలుగా చంద్రుణ్ణి బట్టి జరుగుతుంటుంది వ్యవహారం.
Page 40