#


Index

   ఓం తత్సవితు ర్వరేణ్యం భర్గః - తత్తంటే అది. ఎక్కడో పరోక్షంగా ఉన్న ఆ పరమాత్మ తత్త్వం సవితగా మనకు భాసిస్తున్నది. ప్రసవించేదీ లేదా ప్రసరించేదేదో అది సవిత. సూర్యమండల మని అర్థం. సూర్యుడే అందజేస్తున్నాడు మనబోటి ప్రాణి కోటికి. ఏమిటది. భర్గః - తేజస్సు. ఒక్క తేజస్సే కాదు. జలం కూడా. జలమే కాదు. అన్నం కూడా. సవితృ మండల మంటే ఏదో గాదది. భౌతికమైన మండలంగా కనిపిస్తున్నా పరమాత్మ చైతన్య శక్తి కుపాధి అది. శక్తే తద్రూపంగా భాసిస్తూ మనకు వెలుగునిస్తున్నది. ఆ వెలుగే అందకుంటే మన జీవితాలు ఖాళీ. వెలుగు మాత్రమే గాక జలాన్ని కూడా ప్రసాదిస్తుంది. సూర్యుడి తేజస్సు లేకపోతే జలం లేదు. ఆ జలం భూమిపైన వర్షిస్తుండటం వల్లనే భూమి సారవంతమై పంట చేతికి వస్తున్నది. అన్నం పెడుతున్నది. కనుక పృధ్వి కూడా అదే. తేజో బన్నాత్మకమీ సృష్టి అంతా. ఈ తేజోబన్నాలు మూడూ సవితృ మండల ప్రసాదమే. అది తద్వారా మనకు లభించే పరమాత్మ ప్రసాదమే. అదే దేవస్య. సవితృ మండల రూపంగా ప్రకాశిస్తున్నదసలు. దాని భర్గ. తేజస్సునే ధీమహి పట్టుకొని నిత్యమూ ధ్యానం చేయాలి మనం. ధీమహి అంటే ధ్యానమని కూడా కాదు. నిదధీ మహి. సాధకుడు ఆ దివ్య తేజస్సు మనసులో నింపుకోవాలని కూడా సెలవిచ్చారు సాయనాచార్యులు.

Page 28